Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తత్కాల్ టికెట్ బుకింగ్ కొత్త నిబంధనలు ఇవే: తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

న్యూఢిల్లీ: భారత రైల్వే శాఖ తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఐఆర్‌సీటీసీ కొత్త నిబంధనల ప్రకారం.. తత్కాల్ టికెట్ బుకింగ్, క్యాన్సలేషన్(రద్దు), రిఫండ్ విధానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

  • సాధారణంగా తత్కాల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత టికెట్లు బుక్ అవుతాయి.
  • ఇక నుంచి ఏసీ తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.
  • నాన్‌-ఏసీ టికెట్ల బుకింగ్‌ 11 గంటలకు ప్రారంభిస్తారు.
  • కాగా, తత్కాల్ టికెట్ బుకింగ్స్‌లో సీనియర్ సిటిజన్స్‌కి కూడా ఎలాంటి రాయితీలు ఉండవు.
  • టికెట్‌లో మార్పులు చేసుకునే అవకాశం కూడా లేదు.
  • కావాలని తత్కాల్ టికెట్ రద్దు చేసుకుంటే ఎలాంటి రిఫండ్ రైల్వే శాఖ నుంచి రాదు.
  • అయితే, తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నాక.. రైలు 3 గంటలు అంతకుమించి ఆలస్యమైతే ఛార్జీలు పూర్తిగా తిరిగివ్వాలని కోరే అవకాశం కల్పించారు.
  • ఒక మార్గంలో వెళ్లే రైలుకు తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నాక.. ఆ రైలు రూటును మార్చినా, తాము ఎక్కాల్సిన స్టేషన్‌-దిగాల్సిన స్టేషన్‌ లేదా రెండూ ఆ మార్గంలో లేకపోయినా.. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఛార్జీలు పూర్తిగా తిరిగివ్వాలని కోరవచ్చన‌ని తెలిపింది.
  • బుక్‌ చేసుకున్న క్లాసులో కాకుండా దిగువ తరగతి శ్రేణిలో ప్రయాణించాలని రైల్వే వర్గాలు కోరితే.. ఇష్టం లేని ప్రయాణికులు పూర్తి రిఫండ్‌ కోరవచ్చు.
  • అంతేగాక, ప్రయాణికులు అందుకు అంగీకరిస్తే.. ఛార్జీల మధ్య తేడాను ప్రయాణికులకు రైల్వే చెల్లిస్తుంది.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+