ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన విమానం రష్యాకు మళ్లింపు: ఎందుకంటే?
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన ఓ ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా రష్యాకు మళ్లించారు. చివరకు ఎయిర్ ఇండియా విమానం AI173 అక్కడ సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఎయిరిండియా అధికారులు తెలిపారు.
ఢిల్లీ నుంచి శాన్ప్రాన్సిస్కోకు బయల్దేరిన ఎయిరిండియా విమానం AI173 ఓ ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే విమానాన్ని రష్యా వైపు మళ్లించాలని నిర్ణయించారు. అనంతరం రష్యాలోని మాగదన్ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

ఆ సమయంలో విమానంలో 216 మంది ప్రయాణికులతోపాటు 16 మంది సిబ్బంది ఉన్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. అక్కడ దిగిన వెంటనే ప్రయాణికులకు అవసరమైన వసతి కల్పించడంతోపాటు వారి గమ్యస్థానాలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఎయిరిండియా అధికారులు తెలిపారు. విమానానికి తప్పనిసరి తనిఖీలన్నీ చేస్తున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి వెల్లడించారు.
కాగా, ప్రయాణికులు విమానాన్ని మళ్లించడంతో కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే, విమాన సిబ్బంది ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారని చెప్పారు. ఇక రష్యాలోని విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో తామంతా ఊపిరిపీల్చుకున్నామని చెప్పారు.
Air India flight AI173 operating from Delhi to San Francisco developed a technical issue with one of its engines. The flight with 216 passengers and 16 crew was diverted and landed safely at Magadan airport in Russia. The passengers are being provided with all support on ground… https://t.co/Sq6RmNzbea
— ANI (@ANI) June 6, 2023
ఇది ఇలావుండగా, రెండు రోజుల క్రితం దిబ్రూఘర్కు వెళ్లాల్సిన ఇండిగో విమానంలోనూ సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో గౌహతిలోని లోక్ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. 6E-2652 ఫ్లైట్లో 150 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇందులో పెట్రోలియం కేంద్ర సహాయ మంత్రి రామేశ్వర్ తేలి, ఇద్దరు అస్సాం బీజేపీ ఎమ్మెల్యేలు - ప్రశాంత ఫుకాన్, తెరష్ గోవాలా ఉన్నారు.
"మొదట్లో దిబ్రూగఢ్ విమానాశ్రయంలో విమానం ఎందుకు ల్యాండ్ కాలేకపోయిందో అని మేము భయపడ్డాము. దానిని ఎందుకు గౌహతికి మళ్లించారు. ఆపై ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగా, వారికి ఎక్కువ రన్వే అవసరమని పైలట్ ప్రకటించారని ప్రయాణికులు తెలిపారు. 'నేను కోల్కతా నుంచి ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయమని ఇండిగో అధికారులను అభ్యర్థించాను, కానీ వారు చేయలేకపోయారు. నేను దీనిని ఏవియేషన్ మంత్రికి నివేదిస్తాను' అని ఓ ప్రయాణికుడు చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications