లూలూ కుటుంబంలో లుకలుకలు: భార్యతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన తేజ్ ప్రతాప్ యాదవ్
బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. ఆరు నెలల క్రితమే లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మరో ఆర్జేడీ నేత కుమార్తెతో వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఎంత ఘనంగా ఆ వివాహం జరిగిందో అంతే ఘనంగా ఇద్దరూ విడిపోయేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే పాట్నా కోర్టులో విడాకులు మంజూరు చేయాల్సిందిగా తేజ్ ప్రతాప్ యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు.

పెళ్లయిన ఆరునెలలకే విడాకులా..?
బీహార్ ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లయిన ఆరునెలలకే భార్య ఐశ్వర్యతో విడిపోయేందుకు సిద్ధపడ్డారు. ఇందులో భాగంగానే పాట్నా సివిల్ కోర్టులో విడాకులు మంజూరు చేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇదే విషయమై చర్చించేందుకు తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ శిక్ష అనుభవిస్తున్న రాంచీ జైలుకు తేజ్ప్రతాప్ యాదవ్ వెళ్లారు. శుక్రవారం రాత్రి గయాలో బస చేసిన తేజ్ప్రతాప్ శనివారం తండ్రిని కలిసేందుకు రాంచీ జైలుకు వెళ్లారు. నిజానికి తండ్రిని శుక్రవారమే కలవాల్సి ఉండగా...తల్లి రబ్రీదేవీతో పాటు కొందరు కుటుంబ సభ్యులు వారించడంతో విమానాశ్రయం నుంచి వెనుదిరిగారు.
ఇదిలా ఉంటే తేజ్ప్రతాప్ యాదవ్ విడాకుల కేసు నవంబర్ 29న విచారణకు రానున్నట్లు ఆయన తరపున లాయర్ యశ్వంత్ కుమార్ శర్మ తెలిపారు. తనకు ఏమీ తెలియదని కేవలం దంపతులు కలిసి ఉండలేమని విడాకులు ఇప్పించాల్సిందిగా తనకు చెప్పినట్లు లాయర్ యశ్వంత్ కుమార్ శర్మ చెప్పారు. ఇక ఇంతకు మించి తాను ఏమి చెప్పలేనని లాయర్ వెల్లడించారు.

అసలు సమస్య ఎక్కడ వచ్చింది..?
తేజ్ప్రతాప్ యాదవ్ , ఐశ్వర్యరాయ్ల వివాహం ఈ ఏడాది మే 12న ఘనంగా జరిగింది. ఐశ్వర్యరాయ్ది కూడా రాజకీయ కుటుంబమే కావడం విశేషం. ఐశ్వర్యరాయ్ ఆర్జేడీ నేత చంద్రికా రాయ్ కుమార్తె. ఆమె తాత దరోగా ప్రసాద్ రాయ్ బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక ఐశ్వర్యది కూడా రాజకీయ కుటుంబం కావడంతో ఆమె కూడా రాజకీయాల్లోకి రావాలని భావించారు. ఈ నిర్ణయమే తేజ్ ప్రతాప్ ఐశ్వర్యల పచ్చని కాపురంలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఐశ్వర్య 219 లోక్సభ ఎన్నికల్లో శరన్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారనే వార్త కూడా జోరుగా ప్రచారం చేస్తోంది. ఆమె రాజకీయాల్లోకి రావడం తేజ్ప్రతాప్ యాదవ్కు ఇష్టం లేదని కొందరు సన్నిహితులు చెబుతున్నారు.

తమ్ముడు తేజస్వీ యాదవ్తో విబేధాలు
తేజ్ ప్రతాప్ యాదవ్ ఐశ్వర్యల వివాహం అదరహో అన్నట్లుగా జరిగింది. ఈ వివాహానికి 10వేల మందికి పైగా అతిథులు వచ్చారు. ఈ వివాహం ఎంత ఘనంగా జరిగిందని పేరు వచ్చిందో.. అంతే ఘనంగా అపకీర్తి కూడా మూటగట్టుకుంది. వివాహంలో చాలామంది ఆర్జేడీ నేతలు ఆహారాన్ని, అత్యంత విలువైన డెకరేషన్ వస్తువులను దొంగలించినట్లు వార్తలు వచ్చాయి. ఇక తేజ్ ప్రతాప్ యాదవ్తో వివాహం అనంతరం అతని తమ్ముడు తేజస్వీ యాదవ్తో విబేధాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో పార్టీ నాయకులు తనను పట్టించుకోవడం లేదని తేజ్ప్రతాప్ యాదవ్ బాహాటంగానే ప్రకటించారు కూడా. ఇలా చెబుతూనే తన సోదరుడికి తనకు ఎలాంటి విబేధాలు లేవని తన తమ్ముడు తన హృదయానికి దగ్గరగా ఉంటారని చెప్పారు. తేజస్వీ యాదవ్ కూడా తన అన్నే తనకు మార్గదర్శకుడని తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications