చెన్నైలో పెట్రోల్ బాంబులతో దాడి, మహిళా పోలీసులను లోపలపెట్టి !
జల్లికట్టు ఆందోళన సమయంలో మెరీనా బీచ్ సమీపంలోని ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ మీద ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరి పోలీస్ స్టేషన్ తో పాటు ఆ ప్రాంగణంలో నిలిపి ఉన్న 50 ద్విచక్రవాహనాలు,
చెన్నై: జల్లికట్టు ఆందోళనతో చెన్నై నగరంలో పలు వాహనాలు దగ్దం అయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు. చెన్నైలోని మెరీనా బీచ్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టడానికి ప్రయత్నించిన సమయంలో వారు రెచ్చిపోయారు.
మెరీనా బీచ్ సమీపంలోని ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ మీద ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరారు. పోలీస్ స్టేషన్ తో పాటు ఆ ప్రాంగణంలో నిలిపి ఉన్న 50 ద్విచక్రవాహనాలు, జీపులకు నిప్పంటించారు.
విద్యార్థులు, యువకులతో పెట్టుకుంటే ఇదే గతి (ఫోటో గ్యాలరీ)
పోలీస్ స్టేషన్ లో ఇద్దరు మహిళా పోలీసులతో సహ 16 మంది పోలీసులను లోపలపెట్టి బయట తాళం వేసి నిప్పంటించి సజీవదహనం చెయ్యడానికి ప్రయత్నించారని. అదే సమయంలో తాము అటు వైపు వెళ్లిన విషయం గుర్తించిన ఆందోళనకారులు అక్కడి నుంచి పారిపోయారని సాటి పోలీసులు పై అధికారులకు సమాచారం ఇచ్చారు.

పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులు కిటికీలు పలగొట్టుకుని, వెనుక తలుపుల నుంచి బయటకు వచ్చి ప్రాణాలు రక్షించుకున్నారని అధికారులు అంటున్నారు. చెన్నైలోని కొన్ని చోట్లు 10 కార్లకు నిప్పంటించారని పోలీసు అధికారులు తెలిపారు.
ఇదే చాన్స్: తమిళనాడు సీఎంగా చిన్నమ్మ శశికళ, డేట్ ఫిక్స్ చేశారు !
ముందు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులు, 27 రైలు సర్వీసులు రద్దు చేశారు. ఎట్టకేలకు ఆందోళనకారులను పోలీసులు అదుపుచెయ్యడంతో సామాన్య ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
500 మంది ఆందోళనకారులకు తీవ్రగాయాలైనాయి. ఆందోళకారులు రాళ్లురువ్వడంతో 27 మంది పోలీసులకు గాయాలైనాయి. వాహనాలకు నిప్పంటించారని, పోలీసుల మీద దాడి చేశారని ఆరోపిస్తూ పలువురు యువకులను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications