తమిళనాడుకు షాక్: రోజుకు 3 వేల క్యుసెక్కుల నీరు
న్యూఢిల్లీ: తమిళనాడుకు ఈనెల 21 నుంచి 30వ తేది వరకు (10 రోజులు) మూడు వేల క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యాలని కావేరీ జలాల పంపిణి కమిటి (కావేరీ సూపర్ వైజరీ కమిటి ) కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ జాధవ్ అంగీకరించకుండా విరోధం వ్యక్తం చేశారు. సోమవారం న్యూఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో కావేరీ జలాల పంపిణి కమిటీ ఆధ్వర్యంలో సమావేశం మొదలైయ్యింది.

కావేరీ నీరు మాకు విడుదల చెయ్యాలని తమిళనాడు డిమాండ్ చేసింది. కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కావేరీ జలాల పంపిణి విషయంపై సుదీర్ఘంగా చర్చించారు.
తరువాత ఈనెల 21వ తేది నుంచి 30వ తేది వరకు తమిళనాడుకు ప్రతి రోజు మూడు వేల క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యాలని కేంద్ర జనవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి శశిశేఖర్ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ప్రతి రోజు 12 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేస్తున్నారు.
అయితే మంగళవారం సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు వేచిచూడాలని కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు భావించాయి. ముందు జాగ్రత చర్యగా బెంగళూరు, బెంగళూరు గ్రామీణ, మండ్య, మైసూరు జిల్లాల్లో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications