శాంతి అనే పదానికి శత్రువు కాంగ్రెస్, సర్వనాశనం చేస్తారని మండిపడిన ప్రధాని మోదీ !
బెంగళూరు/మంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళూరులో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడుతున్నారు. శాంతి అనే పదానికి శత్రువు కాంగ్రెస్ పార్టీ, ఉగ్రవాదులకు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వారికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీకి కన్నడిగులు ఓటు వేస్తే కర్ణాటక సర్వనాశనం అవుతుందని, ఈ విషయంలో కర్ణాటక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ మనవి చేశారు. భారతదేశం భద్రత కోసం ప్రాణాలు అర్పిస్తున్న భారత సైనికుల గురించి చులకనగా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 85 శాతం కమీషన్ ఉండేదని. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో 85 శాతం మింగేసిన కాంగ్రెస్ నాయకులు కేవలం 15 శాతం మాత్రమే ప్రజలకు ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కర్ణాటక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే మళ్లీ కర్ణాటకలో రివర్స్ గేర్ ప్రభుత్వం వస్తుందని, అందుకే ఆ పార్టీని, ఆ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్న జేడీఎస్ పార్టీలను దూరం పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లకు మనవి చేశారు. దేశంలో ఎవ్వరిని నమ్మినా నమ్మకపోయినా కాంగ్రెస్ పార్టీని మాత్రం నమ్మకూడదని, ఆ పార్టీలోని కొందరు నాయకులు దేశానికి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.

హిందుస్తాన్ లో జై కర్ణాటక అనే నినాదం జోరుగా వినిపించాంటే బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, సంపూర్ణ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పని చేసి చేసిచూపిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ కన్నడిగులకు హామీ ఇచ్చారు. కర్ణాటకలో మా బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది అని మేము వివరిస్తున్నాము, రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలోని ప్రజలకు ఏం చేసిందో వివరించాలని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చాలెంజ్ చేశారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications