DK కేసు డైరీని ఇవ్వాలని సీబీఐకి హైకోర్టు ఆర్డర్, సోదాలకు, ఎఫ్ఐఆర్ కు తేడా ఉంది !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్పై సీబీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి రెండు రోజుల్లోగా కేసు డైరీని సీల్డ్ కవర్ లో సమర్పించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. అలాగే తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని డీకే. శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను పూర్తి చేసిన కర్ణాటక హైకోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది.
డీకే. శివకుమార్ పిటిషన్ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే. నటరాజన్ డీకే మీద సీబీఐ విచారణ చేసిన కేసు డైరీని సీల్డ్ కవరులో రెండు రోజుల్లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును విచారించిన సీబీఐ దర్యాప్తు అధికారిని హైకోర్టు న్యాయమూర్తి నటరాజన్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి ధర్మాసనం సోమవారం ఆదేశింశారు.

దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ డీకే. శివకుమార్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలను తీవ్రంగా తోసిపుచ్చారు. సీబీఐ తరపున న్యాయవాది సుదీర్ఘ వాదనలు వినిపించారు. చివరకు కేసుకు సంబంధించిన కేసు డైరీని కోర్టుకు సమర్పించేలా ఆదేశించాలని డీకే. శివకుమార్ తరఫు సీనియర్ న్యాయవాది కర్ణాటక హైకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించారు.
ఈ పిటిషన్ను ఆమోదించిన ధర్మాసనం రెండు రోజుల్లోగా డీకే. శివకుమార్ విచారణ కేసు డైరీని సీల్డ్ కవరులో కోర్టుకు సమర్పించాలని సీబీఐ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదనుగుణంగా, దర్యాప్తును త్వరగా ముగించాలన్న ఆయన అభ్యర్థనకు సీబీఐ కూడా అంగీకరించి, దర్యాప్తు పూర్తయిన తర్వాత తీర్పును రిజర్వ్ చేయాలని ఆదేశించింది. న్యూఢిల్లీ, బెంగళూరుతో సహ ఇతర ప్రాంతాలలో డీకే. శివకుమార్కు చెందిన ఇళ్లపై ఆగస్టు 2, 2017న ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఈ సమయంలో సీబీఐ 2020 ఏప్రిల్ 3వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.












Click it and Unblock the Notifications