దాడుల కోసం ‘యాప్’ రూపొందించిన లష్కరే తొయిబా
ఉగ్రవాదులు కూడా ప్రస్తుత సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. పాకిస్థాన్ మద్దతుతో భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తోన్న హఫీజ్ సయీద్, తన ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తొయిబాకు సొంతంగా ఓ యాప్ను తయారు చేయించారు.
దీని ద్వారా తమ కార్యకలాపాలు నిఘా సంస్థలు కనిపెట్టకుండా జాగ్రత్తపడుతున్నారు.లష్కర్ ఎ తొయిబాలో ఉన్న 20 మంది సైబర్ సెల్ ఉగ్రవాదులు ఈ యాప్ తయారు చేశారు.
ఈ యాప్ ద్వారా ఫోన్ కాల్స్ చేసుకోవడం, ఎస్ఎమ్ఎస్లు పంపుకోవచ్చు. జమ్ముకాశ్మీర్లోని ఉధంపూర్లో పట్టుబడిన పాక్ ఉగ్రవాది నవేద్ కూడా ఇదే యాప్ ఉపయోగించినట్లు తెలుస్తోంది.

నవేద్ అరెస్ట్ అనంతరం ఈ యాప్ గురించి వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఈ యాప్ ద్వారా లష్కర్ ఎ తొయిబాకు సహకరిస్తున్న వారి వివరాలు ఎన్ఐఏ అధికారులకు తెలిసినట్లు సమాచారం.
ఆ తర్వాతే కాశ్మీర్ లోయలో లష్కర్ ఎ తొయిబా కమాండర్ అబూ ఖాసింకు సంబంధించిన వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఈ యాప్కు సంబంధించిన సర్వర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. దాడులకు ప్రణాళికలు వేసేవారికి, వాటిల్లో పాల్గొనే వారికే ఈ యాప్ గురించి పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుందని ఓ అధికారి తెలిపారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications