దాడుల కోసం ‘యాప్’ రూపొందించిన లష్కరే తొయిబా
ఉగ్రవాదులు కూడా ప్రస్తుత సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. పాకిస్థాన్ మద్దతుతో భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తోన్న హఫీజ్ సయీద్, తన ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తొయిబాకు సొంతంగా ఓ యాప్ను తయారు చేయించారు.
దీని ద్వారా తమ కార్యకలాపాలు నిఘా సంస్థలు కనిపెట్టకుండా జాగ్రత్తపడుతున్నారు.లష్కర్ ఎ తొయిబాలో ఉన్న 20 మంది సైబర్ సెల్ ఉగ్రవాదులు ఈ యాప్ తయారు చేశారు.
ఈ యాప్ ద్వారా ఫోన్ కాల్స్ చేసుకోవడం, ఎస్ఎమ్ఎస్లు పంపుకోవచ్చు. జమ్ముకాశ్మీర్లోని ఉధంపూర్లో పట్టుబడిన పాక్ ఉగ్రవాది నవేద్ కూడా ఇదే యాప్ ఉపయోగించినట్లు తెలుస్తోంది.

నవేద్ అరెస్ట్ అనంతరం ఈ యాప్ గురించి వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఈ యాప్ ద్వారా లష్కర్ ఎ తొయిబాకు సహకరిస్తున్న వారి వివరాలు ఎన్ఐఏ అధికారులకు తెలిసినట్లు సమాచారం.
ఆ తర్వాతే కాశ్మీర్ లోయలో లష్కర్ ఎ తొయిబా కమాండర్ అబూ ఖాసింకు సంబంధించిన వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఈ యాప్కు సంబంధించిన సర్వర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. దాడులకు ప్రణాళికలు వేసేవారికి, వాటిల్లో పాల్గొనే వారికే ఈ యాప్ గురించి పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుందని ఓ అధికారి తెలిపారు.
-
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications