Ration Card: రేషన్ కార్డులపై కేంద్రం కీలక నిర్ణయం.. మే 1 నుంచి అమలు..!
దేశంలో ఉన్న పేదవారికి ఆహారం అందించేందుకు రేషన్ కార్డులను జారీ చేశారు. రేషన్ కార్డులతో పేదలకు నెలనెలా బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయి. అందుకే రాష్ట్రంతో పాటు దేశంలో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే రేషన్ కార్డు పొందిన వారిలో లక్షల్లో అనర్హులు ఉన్నారు.
రేషన్ కార్డు తీసుకున్న వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే వారు కూడా ఉన్నారు. అంతే కాదు భారీగా భూమి ఉన్నవారికి కూడా రేషన్ కార్డు ఉంది. దీంతో వీరు ప్రభుత్వ పథకాలను పొందుతున్నారు. దీంతో అనర్హులను గుర్తించి వారి రేషన్ కార్డులు తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. అర్హత లేకున్నా అక్రమంగా రేషన్ కార్డులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోనుంది.

ఇందుకు సంబంధించిన నిబంధనలను మే 1 నుంచి అమలు చేయనున్నారు. అలాగే చాలా మంది రేషన్ కార్డులో ఉన్న వారు లేకున్నా వారి పేరుపై రేషన్ తీసుకుంటున్నారు. దీని కోసం రేషన్ ఈ కేవైసీ కూడీ తీసుకొచ్చారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయింది. దీంతో ఈ కేవైసీ చేసుకోలేని వారి పేరును రేషన్ కార్డుల నుంచి తొలగించే అవకాశం ఉంది.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు తీసుకుంది. అంతేకాకుండా మీసేవ ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించింది. అధికారులు ప్రస్తుతం దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. జూన్ లో కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది.
-
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications