వామ్మో.. అదేం వైద్యం రా బాబు.. కళ్లు పొడిచేస్తారు..! త్రిశూలంతో ఒళ్లంతా గుచ్చుతారట..!!
రాయ్పూర్/హైదరాబాద్ : మూడనమ్మకాలు ఓ నిండు ప్రాణాన్ని బలిచేసుకున్నాయి. సమాజం అధునాతన సాంకేతికతతో ముందుకు పరుగులు తీస్తున్నప్పటికి మరో పక్క మూఢ నమ్మకాలంటూ కొందరూ ఇంకా వెనకబడిపోతున్నారు. ముఖ్యంగా వైద్యపరమైన అంశాల్లో ఇంకా మూర్ఖత్వాన్ని విడనాదలేదు కొంత మంది ప్రజలు. దీంతో బూత వైద్యం, దయ్యం పట్టిందని, చెట్ల పసర్తు వాడాలని, ఒంటిపై వాతలు పెట్టాలంటూ మూఢ నమ్మకాలనే నమ్ముతున్నారు కొంతమంది అమాయకులు. ఒక్కోసారి ఈ ముఢ నమ్మకాలతో నిండు ప్రాణాలకు ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు.
ఇందులో అక్షరం ముక్క చదువురాని తాంత్రికులు, బూత వైద్యులు ప్రదాన భూమిక పోషిస్తుంటారు. బూత వైద్యం పేరుతో రోగులను చిత్రహింసలు పెట్టడం, ఏంటని నిలదీస్తే అది వైద్యంలో భాగమని బుకాయించడం సర్వసాధారణం అయిపోయింది. అచ్చం ఇలాంటి సందర్బమే ఝార్ఖండ్లో చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఓ అభాగ్యురాలిని వైద్యం పేరుతో చిత్ర హింసలు పెట్టి ప్రాణాలను తీసారు తాంత్రిక వైద్యులు.

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలు ఏ స్థాయిలో ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తున్నాయో తెలిపే ఘటన ఝార్ఖండ్లో జరిగింది. గర్వా ప్రాంతానికి చెందిన రుద్నీ దేవి అనే మహిళ గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. అయతే ఆమె కుటుంబానికి మూఢ విశ్వాసాలు ఎక్కువ. దీంతో రుద్నీ తల్లితండ్రులు ఆమెను తాంత్రికుల వద్దకు తీసుకెళ్లారు. రుద్నీ రోగాన్ని నయం చేస్తామని చెప్పిన తాంత్రికులు, ఆమెపై వారి విద్యలను ప్రయోగించారు. త్రిశూలంతో శరీరమంతా చిల్లులు పెట్టారు. కళ్లు కూడా పొడిచేశారు. అనారోగ్యంతో సతమతమవుతున్న రుద్నీ, ఈ చిత్ర హింసలను తట్టుకోలేక కన్నుమూసింది.
ఇంత జరిగినా రుద్నీ కుటుంబం మాత్రం తాంత్రికుల చర్య సరైందని బలంగా నమ్మింది. జరిగిన దారుణాన్ని పోలీసులకు తెలియకుండా ఉండేందుకు రుద్నీ మృత దేహాన్ని ఖననం చేసింది. అయితే ఇతర గ్రామస్తుల ద్వారా ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాంత్రికులు కూడా రుద్నీ ఆరోగ్యం కోసమే ఇదంతా చేశామని పోలీసులకు తెలిపినట్టు సమాచారం. రుద్నీ అనారోగ్యానికి కారణం..దుష్ట శక్తి ఆమెను ఆవహించటమేనని, దీనికి భూతవైద్యమే తగిన పరష్కారమని వారు గుడ్డిగా వాదించినట్టు తెలుస్తోంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications