ఏం తమాషానా, పన్నీర్ సెల్వం గ్రూప్ లో చేరిపోతా: సీఎంకు ఎమ్మెల్యే వార్నింగ్ !
తాను చెప్పిన మాటలు పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నారని, నేనంటే అంత చులకనగా ఉందా అంటూ తమిళనాడు సీఎం పళనిసామిని హెచ్చరించిన సూలూరు ఎమ్మెల్యే కగనరాజ్ తాను పన్నీర్ సెల్వం వర్గంలోకి వెళ్లిపోతా
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి అన్నాడీఎంకే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఝలక్ ఇచ్చారు. తాను చెప్పిన మాటలు పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నారని, ప్రత్యర్థి వర్గంలోకి వెళ్లిపోతాయని ప్రత్యక్షంగానే హెచ్చరించారు.
కోయంబత్తూరు సమీపంలోని సులూరు శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే కనగరాజ్ చాల కాలం నుంచి కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లోని క్వారీలు మూసివేయాలని ప్రభుత్వానికి మనవి చేస్తున్నారు. నిరుపయోగంగా ఈ క్వారీలు ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న క్వారీల కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వానికి, అధికారులకు చెప్పారు. అయితే వారు మాత్రం ఆయన మాటలు పట్టించుకోలేదు.

ఈ వివషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కనగరాజ్ ఆదివారం తమిళనాడు సీఎం పళనిసామి ప్రభుత్వంపై మండిపడ్డారు. వెంటనే క్వారీలను మూసివేయకపోతే తాను పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోతానని గట్టిగానే హెచ్చరించారు. తనతో పాటు మరి కొంత మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోతారని శశికళ వర్గానికి ఝలక్ ఇచ్చారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications