గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట: సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి తాను బళ్లారీకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని మనవి చేస్తూ గాలి జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు. అర్జీ పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం .
బెంగళూరు/బళ్లారి: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మరో సారి బళ్లారీలో అడుగు పెట్టి సందడి చెయ్యనున్నారు. తనకుమార్తె బ్రహ్మిణి, అల్లుడు రాజీవ్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి బళ్లారికి బయలుదేరారు.
సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి తాను బళ్లారీకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని మనవి చేస్తూ గాలి జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు. అర్జీ పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం జనవరి 12 నుంచి 16వ తేదీ వరకు బళ్లారీలో ఉండటానికి గాలి జనార్దన్ రెడ్డికి అనుమతి ఇచ్చింది.
గాలి ఫ్రెండ్ శ్రీరాములు ప్యాలెస్ (ఇల్లు) ఇదే (ఫోటోలు)
అక్రమ మైనింగ్ వ్యాపారం చేశారనే కేసులో అరెస్టు అయిన గాలి జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్లారు. జామీనుపై విడుదల అయిన గాలి జనార్దన్ రెడ్డిని బళ్లారీలో అడుగు పెట్టరాదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తన కుమార్తె బ్రహ్మిణి పెళ్లి పనులు చూసుకోవడానికి బళ్లారీ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి కోర్టులో అర్జీ సమర్పించడంతో న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. నవంబర్ 1వ తేదిన గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో మొదటి సారి అడుగుపెట్టి 21 రోజులు సన్నిహితులతో గడిపారు.
గాలి పెళ్లి అదుర్స్: కబాలి, ముఠామేస్త్రీ డ్యాన్స్ (ఫోటోలు)
ఇప్పుడు సంక్రాంతి పండగ జరుపుకోవడానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బళ్లారి బయలుదేరారు. బళ్లారీలోని వీరేనగౌడ కాలనీలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులతో కలిసి 16వ తేదీ వరకు సంక్రాంతి పండగ సంబరాలు జరుపుకోవడానికి సిద్దం అయ్యారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications