Viral Video: ఇదేందిరా నాయనా.. విమానంలో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.. వైరల్ అయిన వీడియో..
బస్సులో ప్రయాణించే ప్రయాణికుల మధ్య గొడవ జరగడం సాధారణం. రైలులో ప్రయాణించే ప్రయాణికుల మధ్య లొల్లి జరగడం కామన్. ఇలాంటి ఘటనలు మనం ఎన్నో చూశాం. కానీ విమానంలో ప్రయాణికుల మధ్య గొడవ జరిగిన ఘటన మనం చూసి ఉండకపొవచ్చు. తాజాగా ఓ విమానంలో ప్రయాణికుల మధ్య గొవడవే కాదు.. ఘర్షణ కూడా జరిగింది. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మొదట మాటల మొదలైన లొల్లి
ఈ వీడియోలో విమానంలో ఓ వ్యక్తి సీట్ లో కూర్చున్నాడు. అతని వద్దకు వచ్చిన మరో వ్యక్తి గొడవకు దిగారు. మొదట మాటల మొదలైన లొల్లి తర్వాత చేయి చేసుకునే వరకు వెళ్లింది. ఎయిర్ హోస్టర్ వారిని వారించే ప్రయత్నం చేసినా వారు వినలేదు. ఈ తతంగాన్ని అంత ఆ విమానంలో ఉన్న మరో ప్రయాణికుడు వీడియో తీశాడు. సోషల్ మీడియాలో పోస్టే చేశారు.
ట్విట్టర్ పోస్ట్
ఈ వీడియోను శుభశంకర్ మిశ్రా అనే వ్యక్తి తన ట్విట్టర్ పోస్ట్ చేశాడు. "బ్యాంకాక్-భారత్ మధ్య థాయ్ స్మైల్ ఎయిర్వే విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.డిసెంబర్ 7వ తేదీకి సంబంధించిన వీడియోను చెబుతున్నారు." అని రాసుకొచ్చారు.
ఈ వీడియోకు 2 లక్షలకు పైగా వ్యూస్
ఈ వీడియోకు 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇదే వీడియోను సౌరభ్ సిన్హా అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. ఈ ఘటన డిసెంబరు 27న బ్యాంకాక్-ఇండియా విమానంలో జరిగినట్లు రాసుకొచ్చారు. కాగా మరో వీడియోలో రైలులో ప్రయణిస్తున్న ఓ మహిళ ఓ వ్యక్తిపై దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను నవీన్ కుమార్ జింతల్ అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.