బీజేపీ అస్త్రం మోదీ, సరిగా మార్కెటింగ్ చేసుకున్నారు : థరూర్
తిరువనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు ముఖ్య కారణం నరేంద్ర మోదీ అని అంగీకరించారు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్. తమ బ్రహ్మాస్త్రం మోదీ .. ఆయన సేవలను బీజేపీ విరివిగా వాడుకుందని వివరించారు. మోదీని, అతని పేరును సరిగ్గా మార్కెటింగ్ చేయడంతో .. ఫలితం ఆ పార్టీ వైపు మొగ్గుచూపిందని వ్యాఖ్యానించారు.

మోదీ మేనియా
ఈ ఎన్నికల్లో మోదీ మేనియా పనిచేసిందని అంగీకరించారు థరూర్. మోదీపై ఉన్న ప్రజాధారణను బీజేపీ సరిగ్గా క్యాష్ చేసుకుందని వివరించారు. ఇందుకోసం ఆ పార్టీకి వేల మంది సోషల్ మీడియా ప్రతినిధులు భాగస్వాములై పనిచేశారని .. మోదీకి ఉన్న పేరును ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటు బ్యాంకుగా మలిచారని గుర్తుచేశారు. దీంతోపాటు ఎన్డీఏ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను .. ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారని తెలిపారు. నిజానికి మేలు జరిగిన కన్నా ఎక్కువ ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. దీంతో జాతీయ భద్రత అంశం కీలకంగా మారిందని ... బాలాకోట్ దాడుల అంశం బీజేపీ విజయానికి ఒక కారణమని అభిప్రాయపడ్డారు. ఈ అంశం దక్షిణాదిలో ప్రభావం చూపకున్నా .. ఉత్తరాది, హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఎఫెక్ట్ చూపిందని పేర్కొన్నారు థరూర్.

సమస్యలే కొంపముంచాయా ?
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని థరూర్ అంగీకరించారు. తమ పార్టీలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయని .. వాటిని అంతర్గతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆయా అంశాలపై సీరియస్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కానించారు. దీంతోపాటు దేశంలో నెలకొన్న సమస్యలపై దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. ఉదహరణకు దేశంలో ఉపాధి కల్పన 45 ఏళ్ల కన్నా ఎక్కువగా ఉందని ఉదహరించారు. అంతేకాదు తమ పార్టీ మేనిఫెస్టోను తాము ఎక్కువ ప్రచారం చేసుకోలేకపోయామని వివరించారు. ఇదీ కూడా తమ పార్టీ ఘోర పరాజయానికి ఒక కారణమై ఉంటుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా న్యాయ్ (కనీస ఆదాయ పథకం) గురించి ఎక్కువగా ప్రచారం చేసుకోకపోవడం లోపంగా మారిందన్నారు.

టెంపరరీ ..
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తాత్కాలికమని .. తిరిగి రాహుల్ నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే కేరళ, పంజాబ్లో ఆ విషయం రుజువైందని తెలిపారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని .. రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్టీ బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ నేతల్లో రాహుల్ ఉత్సాహం నింపుతారన్నారు. ఎన్నికల్లో జరిగిన తప్పిదాలపై తాము ఆత్మపరిశీలన చేసుకొని ముందుకుసాగుతామని పేర్కొన్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications