అన్నాడీఎంకే చీఫ్ గా శశికళ ఎన్నిక చెల్లదు: ఎన్నికల కమిషన్ కు!
చెన్నై/న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళ నాటరాజన్ ను తొలగించాలని కోరుతూ తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలోని 12 మంది ఎంపీలు ఎన్నికల కమిషనన్ కు విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు.
కాసేపట్లో శశికళ అరెస్టు ? 6 గంటల తర్వాత ఏ క్షణంలోనైనా, ఏం చెద్దాం!
ఐదేళ్ల పాటు నిరంతరాయంగా సభ్యులుగా ఉన్న వారే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి అర్హులని పార్టీ విధివిధానాల్లో ఉందని ఎంపీలు ఎన్నికల కమిషన్ కు చెప్పారు. అయితే శశికళ పార్టీలో సభ్యత్వం తీసుకుని ఐదేళ్లు పూర్తి కాకముందే పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారని గుర్తు చేశారు.
నిబంధన 20(2) ప్రకారం పార్టీ ప్రధాన కార్యదర్శిని తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, అండమాన్-నికోబార్ దీవుల్లోని పార్టీ సభ్యులు మాత్రమే ఎన్నుకోవాలని గుర్తు చేశారు. పార్టీలో మార్పులు, చేర్పులు, కొత్తవాటిని రూపొందించడం అన్నాడీఎంకే సర్వసభ్యులకు మాత్రమే ఉందని అన్నారు.
పన్నీర్ కు పప్పు చారు, చిన్నమ్మకు చిప్పకూడు: సెల్వం గూటికి ఎమ్మెల్యేలు
ఈ విషయం నిబంధన 43లో పేర్కొని ఉందని వారు లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ నియమాలను పాటించకుండా నిబంధనలకు విరుద్దంగా జరిగిన శశికళ ఎన్నిక చెల్లదని వారు పన్నీర్ సెల్వం వర్గంలోని ఎంపీలు వాదిస్తున్నారు. ఈకారణంగా అన్నాడీఎంకే పార్టీ ప్రధాని కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని మనవి చేస్తూ ఆపార్టీకి చెందిన 12 మంది ఎంపీలు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు.