అన్నాడీఎంకే చీఫ్ గా శశికళ ఎన్నిక చెల్లదు: ఎన్నికల కమిషన్ కు!
చెన్నై/న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళ నాటరాజన్ ను తొలగించాలని కోరుతూ తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలోని 12 మంది ఎంపీలు ఎన్నికల కమిషనన్ కు విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు.
ఐదేళ్ల పాటు నిరంతరాయంగా సభ్యులుగా ఉన్న వారే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి అర్హులని పార్టీ విధివిధానాల్లో ఉందని ఎంపీలు ఎన్నికల కమిషన్ కు చెప్పారు. అయితే శశికళ పార్టీలో సభ్యత్వం తీసుకుని ఐదేళ్లు పూర్తి కాకముందే పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారని గుర్తు చేశారు.

నిబంధన 20(2) ప్రకారం పార్టీ ప్రధాన కార్యదర్శిని తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, అండమాన్-నికోబార్ దీవుల్లోని పార్టీ సభ్యులు మాత్రమే ఎన్నుకోవాలని గుర్తు చేశారు. పార్టీలో మార్పులు, చేర్పులు, కొత్తవాటిని రూపొందించడం అన్నాడీఎంకే సర్వసభ్యులకు మాత్రమే ఉందని అన్నారు.
ఈ విషయం నిబంధన 43లో పేర్కొని ఉందని వారు లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ నియమాలను పాటించకుండా నిబంధనలకు విరుద్దంగా జరిగిన శశికళ ఎన్నిక చెల్లదని వారు పన్నీర్ సెల్వం వర్గంలోని ఎంపీలు వాదిస్తున్నారు. ఈకారణంగా అన్నాడీఎంకే పార్టీ ప్రధాని కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని మనవి చేస్తూ ఆపార్టీకి చెందిన 12 మంది ఎంపీలు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications