ఆత్మహత్య కేసులో మంత్రి ఏ1 నిందితుడు: రాజీనామా చెయ్యరు: సీఎం, సిగ్గు మానం ఉందా, బీజేపీ !
పోలీసు అధికారి ఆత్మహత్య కేసులో మంత్రి ఏ1 నిందితుడురాజీనామా చెయ్యరని తేల్చి చెప్పిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దూసీబీఐ దర్యాప్తు, సీఎంకు సిగ్గు, మానం ఉంటే రాజీనామా చేయించాలి, బీజేపీ
బెంగళూరు: పోలీసు అధికారి (డీఎస్పీ) ఎంకే. గణపతి ఆత్మహత్య కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ ఆర్ లో ఏ1 నిందితుడిగా ఉన్న మాజీ హోం మంత్రి, ప్రస్తుత బెంగళూరు అభివృద్ది శాఖా మంత్రి కేజే. జార్జ్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తేల్చి చెప్పారు.
మంత్రి కేజే. జార్జ్ ప్రభావం సీబీఐ మీద ఏమీపడదని, అందువలన ఆయన రాజీనామా చెయ్యాల్సిన అవసరం లేదని సీఎం సిద్దరాయ్య చెప్పారు. మంత్రి కేజే. జార్జ్ మీద సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడంతో శుక్రవారం ముఖ్యమంత్రి సీఎం సిద్దరామయ్య మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమై చర్చించారు.

సమావేశం అనంతరం సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ మంత్రి జార్జ్ ను వెనుక వేసుకుని వచ్చారు. సీబీఐ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని సీఎం సిద్దరామయ్య గుర్తు చేశారు. మంత్రి హోదాలో ఉన్న జార్జ్ సీబీఐ మీద ఒత్తిడి తీసుకు వచ్చే అవకాశం లేదని అన్నారు.
కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ సిద్దరామయ్య ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ సిద్దరామయ్యకు సిగ్గు, మానం, మర్యాద ఏమైన ఉంటే వెంటనే జార్జ్ ను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ వెంటనే జార్జ్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి కేసు విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications