బీజేపీపై పోరాడానికి 52 మంది ఎంపీలు చాలు : రాహుల్

న్యూఢిల్లీ : ఎన్నికల ఓటమి తర్వాత అందుబాటులోకి లేకుండా వెళ్లిపోయిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ .. ఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకునేందుకు కార్యక్రమానికి హాజరయ్యారు. బీజేపీ ప్రభుత్వంపై ఎదురుదాడి ప్రారంభించారు. తమ ఒక్కో ఎంపీ .. బీజేపీ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటారని ధీమా వ్యక్తం చేశారు.

These 52 MPs will fight BJP for every inch: Rahul

52 సభ్యులు చాలు ..
లోక్ సభలో తమ 52 మంది ఎంపీలు పార్టీకి కొండంత బలం అని చెప్పారు. వీరంతా కలిసి బీజేపీ 303 మంది ఎంపీలను సమర్థంగా ఎదుర్కొంటారని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం స్వాతంత్ర పూర్వపు పరిస్థితి ఉందని .. మనమంతా కలిసి సమిష్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ సమయంలో మనకు ఎవరి నుంచి మద్దతు లభిస్తుందని ఆశించొద్దని స్పష్టంచేశారు. అంతేకాదు ఈ దేశంలో ఉన్న రాజ్యాంగబద్ద సంస్థలన్నీ ఎన్డీఏ ఆడించే కీలుబొమ్మలని విమర్శించారు. మనమే పోరాడాలి .. మనమే గెలవాలి అని ఎంపీల్లో ధైర్యం నూరిపోశారు. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా పోరాడారని .. ఒక్కొక్కరిని రాహుల్ అభినందించారు.

రాజీనామాపై రాజీ ..
ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాహుల్ పార్టీ నేతలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పోన్ స్విచాప్ చేసుకొని అందుబాటులో లేకపోవడంతో నేతలంతా ఆందోదళన చెందారు. సోనియా కలుగజేసుకొని .. పార్టీ చీఫ్ కొత్త వ్యక్తిని ఎన్నికయ్యే వరకు కొనసాగాలని చెప్పడంతో .. మరో 4 నెలలు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతానని రాహుల్ చెప్పడంతో .. ఈ గొడవ సద్దుమణిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+