నన్నుచూసి భయపడ్తున్నారు: మోడీపై రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం తనను చూసి భయపడుతోందని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం అన్నారు. సభలో నేను మాట్లాడుతానని, కానీ ప్రభుత్వం తనను మాట్లాడనివ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం తనను చూసి భయపడుతోందని, అందుకే పార్లమెంట్లో జెఎన్యు అంశంపై తనను నోరు తెరవనివ్వదన్నారు. జెఎన్యు వివాదంలో రాహుల్ గాంధీ విద్యార్థులకు మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై పార్లమెంట్లో ఈ రోజు గందరగోళం నెలకొంది.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పార్లమెంటు బయట మాట్లాడారు. ప్రభుత్వం భయపడుతోందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, ఎలాంటి అంశంపై అయినా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.
లోకసభలో జెఎన్యు, హెచ్సియు ఘటన పైన స్వల్పకాలిక చర్చ జరుగుతోంది ఈ సందర్భంగా ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రతిపక్షంపై ధ్వజమెత్తారు. అఫ్జల్ గురుకు మీరు అండగా ఉంటే దేశమే మీకు తగిన బుద్ధి చెబుతుందన్నారు. అఫ్జల్ గురు ఉగ్రవాదా కాదా చెప్పాలని ప్రశ్నించారు. ఒకే ర్యాంకు, ఒకే పింఛన్ ఇచ్చింది ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానిదే అన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications