బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హాలీవుడ్ సినిమా స్టైల్లో బెంగళూరులో 70 కేజీల బంగారు నగలు లూటీ, జస్ట్ రూ. 16 కోట్లు, బాత్ రూంలో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో హాలీవుడ్ సినిమా స్టైల్లో ప్రసిద్ది చెందిన ఫైనాన్స్ కంపెనీలో 70 కేజీల బంగారు నగలు ఎత్తుకుపోయారు. ఎప్పటిలాగే కార్యాలయానికి వచ్చిన సిబ్బంది చోరీ జరగిన విషయం గుర్తించి లబోదిబో అంటూ యాజమాన్యం, పోలీసులకు సమాచారం ఇచ్చారు. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను తలతన్నే విధంగా వాటికి ఏం తక్కువ కాదన్నట్లు రూ. 16 కోట్ల విలువైన బంగారు నగలు చోరీ కావడంతో బెంగళూరు పోలీసులు సైతం షాక్ కు గురైనారు.

నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!

 పులకేశీనగర ఏరియా !

పులకేశీనగర ఏరియా !

బెంగళూరు నగరంలోని పులకేశీనగర పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగరాజపురంలో ముతూట్ ఫైనాన్స్ సంస్థ నిర్వహిస్తున్నారు. ఈ ఫైనాన్స్ సంస్థలో స్థానికులు బంగారు నగలు కుదవ పెట్టి వారి అవసరాలకు డబ్బులు తీసుకుంటున్నారు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి ఫైనాన్స్ సంస్థ నిర్వహకులు లెక్కలు సరిచూసుకుని కార్యాలయానికి తాళం వేసి వెళ్లారు.

70 కేజీల బంగారు నగలు

70 కేజీల బంగారు నగలు

మంగళవారం ఫైనాన్స్ సంస్థ సిబ్బంది కార్యాలయానికి వచ్చారు. కార్యాలయంలోని సేఫ్టీ లాకర్స్ ఉన్న రూంలోకి వెళ్లి చూడగా అక్కడి సిబ్బంది దిమ్మతిరిగిపోయింది. సేఫ్టీ లాకర్ లో ఉన్న 70 కేజీలకు పైగా బంగారు నగలు మాయం అయ్యాయని గుర్తించి లబోదిబో అంటూ ఫైనాన్స్ సంస్థ యాజమాన్యం, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

హాలీవుడ్ సినిమా స్టైల్లో !

హాలీవుడ్ సినిమా స్టైల్లో !

ముతూట్ ఫైనాన్స్ కార్యాలయం బాత్ రూం పగలగొట్టి కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగులు మొదట అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చెయ్యకుండా వాటి కనెక్షన్ లు లాగేశారు. తరువాత గ్యాస్ కట్టర్ లు తీసుకుని సేఫ్టీ లాకర్ కు ఏర్పాటు చేసిన అలారమ్ కట్ చేశారు. తరువాత సేఫ్టీ లాకర్లలో ఉన్న 70 కేజీల బంగారు నగలు చోరీ చేసి బూత్ రూంలో నుంచి లోపలికి ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోయారు.

 జస్ట్ రూ. 16 కోట్లు అంతే !

జస్ట్ రూ. 16 కోట్లు అంతే !

లింగరాజపురంలోని ముతూట్ ఫైనాన్స్ సంస్థలో బంగారు నగలు కుదువ పెట్టుకుని డబ్బులు ఇస్తుంటారు. సోమవారం రాత్రి ఫైనాన్స్ సంస్థలో చోరీ అయిన బంగారు నగల విలువ సుమారు రూ. 16 కోట్లకు పైగా ఉంటుందని సంస్థ నిర్వహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముతూట్ ఫైనాన్స్ లో బంగారు నగలు కుదువ పెట్టిన స్థానికులు ఆ సంస్థలో చోరీ జరిగిందని తెలుసుని అక్కడకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముతూట్ ఫైనాన్స్ సంస్థ కార్యాలయంలో ఎక్కడ ఏమి ఉన్నాయి ? అనే విషయం పూర్తిగా తెలిసిన వాళ్లే చోరీ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

English summary
In Bengaluru's Lingarajapuram robbers robbed 70 kg gold in Muthoot finance. Police registered case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X