అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ వద్ద మూడో పేలుడు: ఐదుగురు నిందితుల అరెస్ట్
ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో మూడో పేలుడు సంభవించింది. గురువారం తెల్లవారుజామున అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం పరిసరాల్లోని శ్రీ గురు రామ్దాస్ నివాస్ సమీపంలో పెద్ద శబ్దం వినిపించిందని, ఇది తక్కువ తీవ్రత కలిగిన పేలుడు అని పోలీసులు వెల్లడించారు. పేలుళ్లకు కుట్ర పన్నిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే పేలుడు వెనుక వారి ఉద్దేశమని పోలీసులు తెలిపారు. కాగా, స్వర్ణ దేవాలయం సమీపంలో వరుస పేలుళ్లకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామీ ఆరోపించారు. గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో కూడా గోల్డెన్ టెంపుల్ సమీపంలోనే మరో పేలుడు సంభవించింది. దీంతో స్వర్ణ దేవాలయాన్ని సందర్శించేందకు వచ్చిన భక్తులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. భయాందోళనలకు గురయ్యారు.

పేలుడుపై సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే ఈ పేలుడు ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీస్ కమిషనన్ నౌనిహాల్ సింగ్ తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ఘటనాస్థలికి చేరుకున్నారు.
'పేలుడు ఘటనను ధ్రువీకరిస్తున్నాం. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉంది. బాంబ్ స్క్వాడ్, ఫోరెనిక్స్ బృందాలు చేరుకున్నాయి. ఒక వ్యక్తి కాలికి చిన్న గాయమైంది' అని ఏడీసీపీ మెహతాబ్ సింగ్ తెలిపారు. ఘటనా సమయంలో అక్కడే డ్యూటీ చేస్తున్న ఓ స్వీపర్ మాట్లాడుతూ.. "నేను ఇక్కడ స్వీపర్ను. డ్యూటీ చేస్తుండగా పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. భారీగా పొగలు కమ్ముకున్నాయి' అని తెలిపారు.
కాగా, స్వర్ణ దేవాలయం సమీపంలోని దర్బార్ సాహిబ్ దగ్గర శనివారం రాత్రి అకస్మాత్తుగా జరిగిన ఓ పేలుడులో కొందరు బాలికలు సహా పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పేలుడు జరిగిన ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Amritsar | Picture of the alleged suspect behind the low-intensity explosion that occurred near Golden temple, last night, as per Punjab Police sources. pic.twitter.com/BBBeLDaaIz
— ANI (@ANI) May 11, 2023
పేలుడుతో కొన్ని రాళ్లు, గాజు ముక్కలు వచ్చి తమపై పడ్డాయని కొందరు యాత్రికులు తెలిపారు. ఈ పేలుడు కారణంగా పార్కింగ్ ఏరియాలో ఉన్న పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే స్వర్ణ దేవాలయంలో బాంబు పేలుడు అంటూ వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. పేలుడు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఐదుగురు నిందితులను విచారిస్తున్నారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications