భారత్లో థర్డ్ వేవ్ ప్రారంభమైంది: మెట్రో నగరాల్లోనే 75 శాతం ఒమిక్రాన్ కేసులు
న్యూఢిల్లీ: భారతదేశంలో ఓ వైపు కరోనావైరస్ కేసులతోపాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభమైందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, కోవిడ్ 19 మహమ్మారి మూడవ తరంగాన్ని దేశం ఎదుర్కొంటున్నందున భారతదేశంలో పెద్ద మొత్తంలో ఒమిక్రాన్ కేసులు పెద్ద నగరాల నుంచి నివేదించబడ్డాయని, దేశ వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్ అధిపతి జాతీయ మీడియాకు వెల్లడించారు.
ముంబై, ఢిల్లీ, కోల్కతా వంటి పెద్ద నగరాలు 75 శాతం కరోనా ఒమిక్రాన్ కేసుల వాటాను కలిగి ఉన్నాయి. నవంబర్లో దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా గుర్తించబడిన అత్యంత వ్యాప్తి చెందగల కరోనావైరస్ వేరియంట్ ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్లను కలిగి ఉందని వ్యాక్సిన్ల రోల్అవుట్లో చాలా సన్నిహితంగా పాల్గొన్న డాక్టర్ ఎన్కె అరోరా చెప్పారు.

డిసెంబర్ మొదటివారంలో దేశంలో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదైంది. డిసెంబర్ చివరి వారం వరకు వెలుగుచూసిన కరోనా వైరస్ కేసుల్లో 12 శాతం ఒమిక్రాన్ వేరియంట్ అని తేలింది. గత వారం 28 శాతం అధికంగా ఉన్నాయి. దేశంలో క్రమంగా కరోనా వైరస్ కేసులతోపాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్నాయని డాక్టర్ అరోరా తెలిపారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా లాంటి ఈ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.
ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూస్తున్న 75 శాతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు ఇమ్యునైజేషన్పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ చైర్మన్ డాక్టర్ అరోరా తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 1700లకుపైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్ర నుంచే 510 ఒమిక్రాన్ కేసులున్నాయి. దేశంలో 22 శాతం కరోనా కేసులు పెరిగాయన్నారు.
కరోనా మహమ్మారి మూడవ తరంగం ఇక్కడ చాలా ఎక్కువగా ఉందని డాక్టర్ అరోరా చెప్పారు. దేశంలో ఇప్పుడు థర్డ్ వేవ్ ప్రారంభమైందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు డాక్టర్ అరోరా. గత మూడు నాలుగు రోజుల నుంచి దేశంలో మరోసారి కేసులు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు.
దేశంలో ప్రస్తుతం 15-18 ఏళ్ల పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్లు సురక్షితం కాదనే వాదనను డాక్టర్ అరోరా తోసిపుచ్చారు. 15-18ఏళ్ల వయస్సు పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్లు ఖచ్చితంగా సురక్షితమైనవేనని ఆయన స్పష్టం చేశారు. 12 నెలల వరకు వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తాయని ఆయన తెలిపారు. ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ డిసెంబర్ 20న కోవాక్సిన్ షెల్ఫ్-లైఫ్ను పొడిగించేందుకు భారత డ్రగ్స్ రెగ్యులేటర్ అనుమతించింది. కాగా, జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications