ప్రతి భారతీయుడి కల: జైట్లీ బడ్జెట్పై ప్రధాని మోడీ ప్రశంస
న్యూఢిల్లీ: 2016-17 సంవత్సరానికి గాను ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్ను సోమవారం పార్లమెంట్లో సమర్పించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోడీ తనదైన శైలిలో స్పందించారు. ఈ బడ్జెట్లో వ్యవసాయం, రైతులు, మహిళలు, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రధాని మోడీ అన్నారు.
ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అద్భుతమైన బడ్జెట్ రూపొందించారంటూ అభినందనలు తెలియజేశారు. బడ్జెట్లో గృహ నిర్మాణ రంగంపై ప్రధాన దృష్టి పెట్టారని అన్నారు. తద్వారా ప్రతి భారతీయుడి సొంతింటి కల సాకారమయ్యే అవకాశం ఉందని చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా ఈ బడ్జెట్ ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

బడ్జెట్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మామూలేనని, తాను ఈ విషయాన్ని పట్టించుకోనని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ దేశంలోని ప్రతి వ్యవసాయ భూమికి నీరు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
2019 నాటికి దేశంలోని ప్రతి గ్రామానికి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా రోడ్డు సౌకర్యం కల్పిస్తామని ఆయన చెప్పారు. అలాగే 2018 నాటికి దేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులు జరిగాయని ఆయన అన్నారు.
బీపీఎల్ కుటుంబాల్లో పొగ బారినపడి ఎంతో మంది అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఉచితంగా దేశ వ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశామని ఆయన చెప్పారు. పదవీ విరమణ తర్వాత సైనికులంతా 'ఒన్ ర్యాంక్ ఒన్ పెన్షన్' అందుకుని అందరూ సురక్షితంగా ఉండాలని ఆ విధానం అమలు చేశామని చెప్పుకొచ్చారు.
యువభారతం మరింతగా దూసుకెళ్లేందుకు నైపుణ్య శిక్షణను అందించనున్నట్లు తెలిపారు. యువ పారిశ్రామిక వేత్తలను తయారు చేసేందుకు స్టార్టప్స్ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. రోజ్గార్ యోజన ద్వారా మరిన్ని సౌకర్యాలు అందజేస్తున్నామని చెప్పారు. అందరికీ ఒకే రకమైన ఫలాలు అందే దిశగా బడ్జెట్లో కేటాయింపులు చేశామని చెప్పారు.
విద్యావ్యవస్థలో విలువలను పెంచేందుకు గ్రూపులు ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా అందరూ మరింత బాగా చదువుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ బడ్జెట్ రూపకల్పనలో శ్రమ పడిన అరుణ్ జైట్లీని ఆయన కొనియాడారు. బడ్జెట్లో సామాన్య ప్రజలకు పెద్దపీట వేశామని పేర్కొన్నారు.
For us primary education is very important. A qualitative transformation of the education sector is what we are giving priority to: PM
— PMO India (@PMOIndia) February 29, 2016
Our youth, especially the Dalit youth and tribal youngsters want to be job creators and not job seekers: PM @narendramodi #VikasKaBudget
— PMO India (@PMOIndia) February 29, 2016
Budget clearly calls for electrifying all villages thus giving an impetus to rural infrastructure: PM @narendramodi on Budget #VikasKaBudget
— PMO India (@PMOIndia) February 29, 2016
బడ్జెట్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హర్షం
కేంద్ర బడ్జెట్పై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. 2016-17 బడ్జెట్ పేదలు, రైతులకు అనుకూలమైన బడ్జెట్ అని ప్రశంసలు కురిపించారు. బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టడం నిజంగా అభినందనీయమంటూ ప్రధాని మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
BJP President Sh @AmitShah congratulated PM Sh @narendramodi & FM Sh @arunjaitley for a pro-poor & pro-farmer budget pic.twitter.com/OnaiSE2ZzV
— Office of Amit Shah (@AmitShahOffice) February 29, 2016
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications