22 ఏళ్ళుగా ఆ ఇంటికి కుళాయి కనెక్షన్ లేదు, కానీ, పుష్కలంగా నీరు ఎలా?
కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు పట్టణంలో ఓ వ్యక్తి 22 ఏళ్ళుగా నీటి కనెక్షన్ లేకుండా జీవనం సాగిస్తున్నాడు. అయితే అక్రమంగా కూడ ఆయన తన ఇంటికి కుళాయి కనెక్షన్ వాడుకోవడం లేదు.
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు పట్టణంలో ఓ వ్యక్తి 22 ఏళ్ళుగా నీటి కనెక్షన్ లేకుండా జీవనం సాగిస్తున్నాడు. అయితే అక్రమంగా కూడ ఆయన తన ఇంటికి కుళాయి కనెక్షన్ వాడుకోవడం లేదు.వర్షపు నీటిని స్టోరేజీ చేసుకొని ఆయన తన ఇంటి అవసరాలకు వాడుకొంటున్నాడు.
కర్ణాటక స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సీనియర్ శాస్త్రవేత్తగా శివకుమార్ పనిచేస్తున్నాడు. ఆయన తన ఇంటికి 22 ఏళ్ళుగా ప్రభుత్వ కుళాయి కనెక్షన్ తీసుకోలేదు.
తాను ఇంటిని నిర్మించే సమయంలోనే రోజుకు కనీసంగా 400 లీటర్ల వర్షపు నీటని స్టోర్ చేసేలా కట్టుకొన్నారు. ఈ విధంగా ఆయన తన ఇంటికి అవసరమైన నీటిని ప్రభుత్వ కుళాయి కనెక్షన్ అవసరం లేకుండానే తీర్చుకొంటున్నాడు.
ఆయన తన ఇంట్లో సుమారు 45 వేల లీటర్ల నీటిని విలువ చేసే ట్యాంకును నిర్మించారు. శక్తి వనరులు, వర్షపు నీటిని తిరిగి వినియోగించుకోవడం ఎలా అనే విభాగంలో పనిచేస్తున్న ఆయన తన ఇంటికి ఏడాదికి మొత్తం 2.3 లక్షల లీటర్ల నీరు సరిపోతోందన్నారు.వంద రోజులకు 40 వేల లీటర్ల నీరు అవసరం ఉంటుందని, అయితే తమకు 45 వేల లీటర్ల విలువ సామర్థ్యం ఉందని ఆయన చెప్పారు.