గాంధీని చంపినవాళ్లే.. నా హత్యకు యత్నించారు: అసదుద్దీన్ ఒవైసీ ఆరోపణలు
న్యూఢిల్లీ: తన వాహనంపై జరిగిన కాల్పుల ఘటనపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి స్పందించారు. తన వాహనంపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం భాగ్పత్ జిల్లా ఛప్రౌలిలో జరిగిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.
అప్పట్లో మహాత్మా గాంధీని చంపినవారే ఇప్పుడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ దాడికి సంబంధిత ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారికి బీజేపీతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న క్రమంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
తనపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు కానీ, తనను అల్లా కాపాడాడని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరఠ్ జిల్లా కితౌర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఢిల్లీకి వెళ్తుండగా.. ఛాజర్సీ టోల్ ప్లాజా వద్ద అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరిగాయి. ఆ తర్వాత షూటర్లు ఆయుధాలను అక్కడే వదిలేసి పరారయ్యారని చెప్పారు. తామంతా సురక్షితంగా బయటపడ్డామని ఘటన అనంతరం ఒవైసీ తెలిపారు.

కాగా, ఈ ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం అసదుద్దీన్ ఒవైసీకి జడ్ కేటగిరీ భద్రతను కల్పించగా.. దాన్ని ఆయన తిరస్కరించారు. తనకు జడ్ కేటగిరీ భద్రత అక్కర్లేదని, అందరిలాగే తాను ఏ కేటగిరీ పౌరుడిగానే ఉండాలనుకుంటున్నట్లు అసదుద్దీన్ స్పష్టం చేశారు. అంతేగాక, తన కారుపై కాల్పుల ఘటనను లోక్సభలో ఆయన ప్రస్తావించారు.
తాను చావుకు భయపడబోనని అన్నారు. తనకు జడ్ కేటగిరీ భద్రత అవసరం లేదనీ, దాన్ని తిరస్కరించినట్లు తెలిపారు. కాల్పులు జరిపిన వారి చూసి తాను ఏమాత్రం భయపడనన్నారు. దాడి చేసిన వారికి యూపీ యువకులు బ్యాలెట్ ద్వారా సమాధానం చెబుతారన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
తనపై కాల్పులు జరిపిన వారిపై యూఏపీఏ చట్టం ఎందుకు ప్రయోగించరని ప్రశ్నించారు అసదుద్దీన్ ఒవైసీ. తనపై కాల్పులు జరిపిన వారిని శిక్షించి.. తనకు న్యాయం చేయాలని కోరారు. ఇటీవల పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం అంశంపైనా తాను బలంగా ప్రశ్నించినట్లు తెలిపారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications