చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముగ్గురు మృతి: క్షతగాత్రుల్లో నటుడి కుమారుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Three killed in car-lorry collision near Mahabalipuram; actor Nasser's son among injured
చెన్నై: మహబలిపురం సమీపంలోని మనవాయ్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారు ట్యాంకర్ లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. మృతుల్లో ఒకరిని పోలీసులు 23 ఏల్ల సయ్యదా అబుగా గుర్తించారు. అతను చెన్నైలోని అవర్తిరునగర్‌కు చెందినవాడు. మరో ఇద్దరు మృతులను ఇంకా గుర్తించాల్సి ఉంది.

గాయపడినవారిలో ప్రముఖ సినీ నటుడు నాజర్ కుమారుడు ఎన్ అబ్దుల్ అసన్ ఫైజల్ (23) ఉన్నాడు. గాయపడినవారిలో మోర యువకుడు 23 ఏళ్ల ఎస్ విజయకుమార్ రోయపురానికి చెందినవాడు. గాయపడినవారిని చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలింతారు.

మహాబలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడినవారి ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

English summary
Three people died on the spot and two others suffered serious injuries when a car they were travelling in collided head on with a tanker lorry at Manavai near Mahabalipuram on Thursday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X