ఢిల్లీ జూలో ఆడ పులి మృతి: కరోనా అనుమానం, పరీక్షలకు నమూనాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జూలో బుధవారం ఓ ఆడ పులి కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా మృతి చెందింది. అయితే, దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో పులికి సంబంధించిన నమూనాలను కరోనా పరీక్షల కోసం పంపారు.
బుధవారం సాయంత్రం కల్పన అనే ఈ ఆడపులి మరణించింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల నేపథ్యంలో గురువారం ఈ పులి అంత్యక్రియలను నిర్వహించారు. జంతువుల నుంచి కూడా మనషులకు కరోనా సోకే అవకాశం ఉండటంతో పులి నమూనాలను కరోనా పరీక్షలు చేసేందుకు నిర్ణయించారు.

కాగా, పులి పోస్టుమార్టం రిపోర్టులో అధిక క్రియేటినిన్ ఉందని తేలింది. పులి అంత్యక్రియలు కొంత మంది అధికారులు మాత్రమే పాల్గొన్నారు. పులికి సంబంధించిన నమూనాలను ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్(బరేలీ)కి పంపించారు.
Recommended Video
సెక్రటరీ ఆఫ్ సెంట్రల్ జూ అథారిటీ మాజీ మెంబర్ డీఎన్ సింగ్ శుక్రవారం మాట్లాడుతూ జూ అధికారుల నిర్లక్ష్యం వల్లే పులి మరణించిందని ఆరోపించారు. డీహైడ్రేషన్ కారణంగానే పులి చనిపోయిందని అన్నారు. రెక్టమ్ ద్వారా సెలైన్ పెట్టించాలని సీనియర్ వెటర్నరీ అధికారి చెప్పినప్పటికీ జూ అధికారులు వినిపించుకోలేదన్నారు. పులి అంత్యక్రియల్లో కూడా సీనియర్ అధికారులు ఎవరూ వెల్లడించలేదని తెలిపారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications