నల్లదుస్తులతో అమ్మ జయలలితకు నివాళులు అర్పించిన సీఎం, మౌనప్రదర్శన!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలితకు మంగళవారం తమిళనాడులో నివాళులు అర్పిస్తున్నారు. మంగళవారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆయన ఇంటి ముందు జయలలిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో సహ పలువురు మంత్రులు, అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు నల్లరంగు దుస్తులు వేసుకుని జయలలితకు నివాళులు అర్పించారు. అమ్మలేని లోటు సంవత్సరం పూర్తి అయినా ఇంత వరకు తీరలేదని సీఎం పళనిస్వామి విచారం వ్యక్తం చేశారు.

జయలలిత మొదటి వర్దంతి సందర్బంగా చెన్నైలో మౌనప్రదర్శన నిర్వహించాలని సీఎం ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శాంతియుతంగా మెరీనా బీచ్ లో అమ్మ సమాధి వరకూ మౌనప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు.
అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్, అమ్మ మేనకోడలు దీపా జయకుమార్ మెరీనా బీచ్ లో అమ్మ సమాధి దగ్గర నివాళులు అర్పించడానికి సిద్దం అయ్యారు. జయలలిత మొదటి వర్దంతి సందర్బంగా భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో చెన్నైలోని మెరీనా బీచ్, జీఎస్ టీ రోడ్డు, అన్నాసలై, కామరాజర్ సలై ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications