పన్నీర్ సెల్వంకు పిచ్చిపట్టింది: తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి
తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేయ్యిజారిన తరువాత పన్నీర్ సెల్వం ఏమీ మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సీ. విజయభాస్కర్ అన్నారు. శనివారం ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేయ్యిజారిన తరువాత పన్నీర్ సెల్వం ఏమీ మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సీ. విజయభాస్కర్ అన్నారు. శనివారం ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మీద విరుచుకుపడ్డారు.
తమిళనాడు ముఖ్యమంత్రి పదవి పోయినప్పటి నుంచి పన్నీర్ సెల్వం మానసికంగా కుంగిపోయారని, అందుకే ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ వ్యగంగా అన్నారు.

ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మీద పన్నీర్ సెల్వం చేస్తున్న ఆరోపణలలో పసలేదని కొట్టిపారేశారు. పన్నీర్ సెల్వం చేస్తున్న ఆరోపణలను మంత్రి విజయభాస్కర్ ఖండించారు. జయలలిత అనారోగ్యంతోనే మరణించారని ఇప్పటికే తాము ప్రభుత్వం తరపున నివేదిక ఇచ్చామని మంత్రి విజయభాస్కర్ గుర్తు చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉంటూ జయలలిత అనుమానాస్పదస్థితిలో మరణించారని, అమ్మ ఎలా మరణించారు అనే పూర్తి వివరాలు బయటపెట్టాలని, న్యాయవిచారణ చేయించాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ స్పందిస్తూ పన్నీర్ సెల్వంకు పిచ్చిపట్టి మాట్లాడుతున్నారని పరోక్షంగా విమర్శించారు.












Click it and Unblock the Notifications