Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

7రాష్ట్రాల్లో ముగిసిన రాజ్యసభ ఎన్నికలు: టీలో బీజేపీ దూరం

న్యూఢిల్లీ/హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో శుక్రవారం రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 25 సీట్లకోసం యూపీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కేరళల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు పూర్తయిన గంట తర్వాత సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్‌ మొదలవుతుంది. ఇందులో పదిసీట్లు ఒక్క ఉత్తరప్రదేశ్‌ నుంచే ఉన్నాయి.

శుక్రవారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సాగింది. యూపీలో 10 సీట్లకు ఎన్నికలు జరగనుండగా బీజేపీ 8, ఎస్పీ ఒక స్థానంలో సులభంగా గెలిచేందుకు అవకాశం ఉంది. అయితే పదో స్థానం కోసం బీజేపీ అదనంగా బరిలో దించిన అభ్యర్థికి, బీఎస్పీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

 Today polls for 25 Rajya Sabha seats: all eyes on Uttar Pradesh

ఎస్పీ వద్ద అదనంగా ఉన్న ఎమ్మెల్యేల మద్దతుతో బీఎస్పీ గెలుస్తుందని భావించినా.. ఇండిపెండెంట్లతోపాటు ఎస్పీలోని శివ్‌పాల్‌ వర్గం ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నిక రసవత్తరంగా మారింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నర్సింహారావు బరిలో ఉన్నారు. మొత్తం 10 రాష్ట్రాల్లో 58 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవగా.. నాలుగు రాష్ట్రాల్లోని 33 సీట్లు ఏకగ్రీవం కావటంతో మిగిలిన 25 సీట్లకే శుక్రవారం ఎన్నికలు జరిగాయి.

Mar 23, 2018, 4:17 pm IST

శుక్రవారం సాయంత్రం 4గంటలకు రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. మరో గంటలో ఫలితాలు వెలువడనున్నాయి.
Mar 23, 2018, 3:10 pm IST

బీజేపీ 16, కాంగ్రెస్ 5, టీడీపీ 2, వైయస్సార్ కాంగ్రెస్ 1, జేడీయూ 2, ఆర్జేడీ 2, శివసేన 1, ఎన్సీపీ 1, బీజేడీ 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే వీటిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Mar 23, 2018, 2:18 pm IST

క్రాస్ ఓటింగ్ ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు కొద్ది నిమిషాలపాటు నిలిచిపోయాయి.
Mar 23, 2018, 2:17 pm IST

కర్ణాటక రాజ్యసభ ఎన్నికల్లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు.
Mar 23, 2018, 1:10 pm IST

ఫిరాయించిన ఎమ్మెల్యేల ఓటు హక్కును పరిగణలోకి తీసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
Mar 23, 2018, 1:10 pm IST

ఇప్పటి వరకు 101మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Mar 23, 2018, 11:40 am IST

టీఆర్ఎస్ ఎలక్షన్ ఏజెంట్లుగా రమేష్‌రెడ్డి, శ్రవణ్‌రెడ్డి, రాజేష్, గట్టు రామచంద్రరావు ఉండగా, కాంగ్రెస్ ఎలక్షన్ ఏజెంట్లుగా మల్లు రవి, సీతక్క, రేగా కాంతారావు, కోదండరెడ్డి ఉన్నారు.
Mar 23, 2018, 11:39 am IST

మొదట హరీష్‌రావు ఓటు హక్కు వినియోగించుకోగా రెండో ఓటు హక్కును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి వినియోగించుకున్నారు.
Mar 23, 2018, 11:39 am IST

ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకుగానూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ ప్రత్యేక బస్సులో టీఆర్ఎస్ భవన్ నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు.
Mar 23, 2018, 11:39 am IST

తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మొదట ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Mar 23, 2018, 10:56 am IST

ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి 58 మంది ఎంపీలు ఉన్నారు.
Mar 23, 2018, 10:56 am IST

2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీకి ఎక్కువ రాజ్యసభ స్థానాలు వచ్చాయి.
Mar 23, 2018, 10:56 am IST

2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీకి ఎక్కువ రాజ్యసభ స్థానాలు వచ్చాయి.
Mar 23, 2018, 10:56 am IST

45 మంది రాజ్యసభ సభ్యుల్లో ఉత్తర్‌ప్రదేశ్ నుంచే 31 మంది ఎంపీలు ఉంటారు.
Mar 23, 2018, 10:56 am IST

కాగా, సమాజ్‌వాదీ, బహుజన్‌ సమాజ్‌వాదీ పొత్తు కారణంగా మరో సీటు గెలవడంపై అనుమానాలు నెలకొన్నాయి.
Mar 23, 2018, 10:55 am IST

యూపీలోని 10 స్థానాల్లో 8 చోట్ల బీజేపీ సులువుగా గెలిచే అవకాశాలున్నాయి.
Mar 23, 2018, 10:55 am IST

ఉత్తర్‌ప్రదేశ్ నుంచి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కూడా బరిలో ఉన్నారు.
Mar 23, 2018, 10:27 am IST

ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, జార్ఖండ్, చత్తీస్‌గడ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతోంది.
Mar 23, 2018, 10:24 am IST

తెలంగాణతోపాటు 25 సీట్ల కోసం ఆరు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది.
Mar 23, 2018, 10:23 am IST

కాగా, టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు తెలిపింది.
Mar 23, 2018, 9:10 am IST

టీఆర్ఎస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఒకరు (బలరాం నాయక్) బరిలో ఉన్నారు.
Mar 23, 2018, 9:08 am IST

తెలంగాణలో మూడు సీట్లకు నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Mar 23, 2018, 9:06 am IST

తెలంగాణలో పోలింగ్ కోసం అసెంబ్లీ కమిటీ హాల్‌లో 7కౌంటర్లు ఏర్పాటు చేశారు.
Mar 23, 2018, 9:04 am IST

శుక్రవారం ఉదయం 9గంటలకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
Mar 23, 2018, 8:30 am IST

ఉదాహరణకు ఉత్తర్‌ప్రదేశ్‌ను తీసుకుంటే, ఆ రాష్ట్రంలో 403 మంది ఎమ్మెల్యేలున్నారు. అక్కడ 10 సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒక్కో అభ్యర్థికి [(403x100) / (10+1) ] + 1 = 3,664 ఓట్లు కావాలి. కనీసం 37 మంది ఎమ్మెల్యేలు మద్దతివ్వాలి.
Mar 23, 2018, 8:30 am IST

[(ఎమ్మెల్యేల సంఖ్య x 100) / (ఖాళీలు + 1)] +1
Mar 23, 2018, 8:29 am IST

ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 100. రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు అభ్యర్థికి అవసరమైన మొత్తం ఓట్లు ఇలా ఉంటాయి.
Mar 23, 2018, 7:38 am IST

కాగా, ఎన్నికల నిబంధనల ప్రకారం సభ్యులు ఎవరికి ఓటు వేస్తున్నారో పార్టీ పోలింగు ఏజెంటుకు చూపించాలి.
Mar 23, 2018, 7:37 am IST

ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థి బలరామ్‌నాయక్‌కు ఓటు వేయాలని కాంగ్రెస్‌ విప్‌ జారీ చేసింది.
Mar 23, 2018, 7:37 am IST

కాంగ్రెస్‌ పార్టీ వాస్తవ బలం 17కాగా ఇందులో ఏడుగురు టీఆర్ఎస్‌లో చేరారు.
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+