వైద్యుని ఇంట్లోకి ఆగంతకుడు, మూడు హత్యలు
న్యూఢిల్లీ: భువనేశ్వర్ సిటీలోని ఖందగిరి విహార్లో ఓ వైద్యుని ఇంట్లో మగ్గురు హత్య చేయబడ్డారు. ఈ ఘటన ఆ పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలాన్ని సృష్టించింది. ఆర్దోపెడిక్ సర్జన్గా ఉన్న అతుల్య చంద్ర మెహర్ ఇంట్లోకి ఆ ఆగంతకుడు చాకచక్యంగా ప్రవేశించి అతని ఇంట్లో సంరక్షుడిగా ఉన్న కుటుంబంపై దాడి చేశాడు. ఈ ఘటనలో డాక్టర్ అతుల్య చంద్ర మెహర్తో పాటు మరో ఇద్దరు చనిపోయారని నగర కమిషనర్ రాజేంద్ర శర్మ తెలిపారు.
వివరాల్లోకి వెళితే డాక్టర్ అతుల్య చంద్ర మెహర్ ఇంటి క్రింది విభాగంలో పవివాళ్లు ఉండే నివాసంలో ప్రశాంత్ బెహ్రాతో పాటు అతని భార్య, కుమారుడు నివసిస్తున్నారు. ఆ ఆగంతకుడు ప్రశాంత్ బెహ్రాతో పాటు, భార్య కుమారుడిపై దాడి చేశాడని పేర్కొన్నారు.

దీంతో తొలి అంతస్తులో ఉంటున్న డాక్టర్ అతుల్య చంద్ర మెహర్ క్రింద ఇంట్లో ఏదో అలజడి జరుగుతుందని గ్రహించి అక్కడకి రావడంతో... అతనిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో డాక్టర్ అతుల్య చంద్ర మెహర్తో పాటు, సంరక్షకుడు ప్రశాంత్ బెహ్రా, అతని కుమారుడు మరణించారని తెలిపారు.
ఐతే ఈ ఘటన నుండి ప్రాణాలతో బయటపడిన ప్రశాంత్ బెహ్రా భార్యను కటక్లోని ఎస్సీబి మెడికల్ కాలేజీకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.












Click it and Unblock the Notifications