17 నుంచి 20 గంటలు వీరోచిత పోరాటం, పీఎల్ఏ రాళ్ల దాడి చేయగా ఫైట్, ఐటీబీపీ డీజీ..
తూర్పు లడాఖ్లోని గాల్వాన్ వ్యాలీ వద్ద చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, భారత జవాన్లపై రాళ్లతో దాడిచేసిన సంగతి తెలిసిందే. కల్నల్ సంతోష్ సహా 20 మంది వీరమరణం పొందారు. అయితే ఆ రోజు సరిహద్దు వద్ద ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు విరోచితంగా పోరాడారని తెలిపింది. దాదాపు 17 నుంచి 20 గంటల పాటు పీఎల్ఏపై పోరాడారని గుర్తుచేశారు. హిమాలయా కొండపై రాళ్లతో దాడి చేసే సమయంలో ఫైట్ చేయడం కష్టమని వివరించారు.

ఆ సమయంలో దాదాపు 294 మంది ఐటీబీపీ సభ్యులు వీరోచితంగా ఫైట్ చేశారని డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఆ సమయంలో పోరాడిన 21 మందికి శౌర్య పతకాలు ఇవ్వాలని సిఫారసు చేశామని తెలిపారు. పీఎల్ఏ దాడి చేయడంతో మొహానికి షీల్ పెట్టుకొని నిరోధించి. అలాగే ప్రతీ దాడి చేశారని పేర్కొన్నారు.
Recommended Video
ఛత్తీస్ గడ్లో నక్సల్స్ ఏరివేతలో ధైర్య సాహసాలు చూపిన ఆరుగురు సిబ్బందిని డీజీ అభినందించారు. ఐటీబీపీలో 90 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 3 వేల 488 కిలోమీటర్ల ఎల్ఏసీ వద్ద సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. లడాఖ్లోని కరకోర నుంచి అరుణాచల్ ప్రదేశ్ వద్ద గల జాచెప్ సరిహద్దులో వీరు విధులు నిర్వహిస్తున్నారు. జూలై 5వ తేదీన ఘర్షణ జరగగా.. ఇండిపెండెన్స్ డే వేళ ఐటీబీపీ డీజీ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications