వరదలో కొట్టుకుపోయిన లారీ, రాత్రంతా కొమ్మపై డ్రైవర్
హుబ్లీ: మలప్రభ నది వరదలో లారీ కొట్టుకు పోయి, డ్రైవర్ ఆరేడు గంటల పాటు వరదలోని చెట్టు పైన గడిపిన సంఘటన కర్నాటకలోని హుబ్లీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆదివారం నాడు ఈ సంఘటడన జరిగింది. సదరు డ్రైవర్ హర్యానాకు చెందిన రామ్ కుమార్.
ఆదివారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో అతని ట్రక్ వరద నీటిలో చిక్కుకొని కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఉదయం దాకా అతను చెట్టు కొమ్మని పట్టుకొని గడిపాడు. అతనిని ఉదయం ఏడు గంటల ప్రాంతంలో బయటకు తీసుకు వచ్చారు.

భారీ వర్షాల కారణంగా కర్నాటకలో పలు ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి. వరద కారణంగా హుబ్లీ - విజయపుర జాతీయ రహదారిని బ్లాక్ చేశారు. దీంతో, వందలాది వాహనాలు స్థానికంగా ఉన్న బ్రిడ్జికి ఇరువైపుల కూడా నిలిచిపోయాయి. కాగా, అతను ట్యాక్స్ను ఎగ్గొట్టేందుకు మరో దారిలో వెళ్లబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications