కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలను కలవనున్న విజయ్.. ఎప్పుడంటే ??
ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్.. కరూరులో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యవహారం కేవలం తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు విజయ్ బాధితుల కుటుంబాలను కలవడానికి సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాగా ఈ నెల 17న కుటుంబాలను వారి ఇళ్ల వద్ద కాకుండా, ఒక ప్రత్యేక వేదికలో.. బాధిత కుటుంబాలను పరామర్శించనున్నట్లు సమాచారం. అయితే వేదిక వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విజయ్ బాధితులను కలిసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత కల్పించాలని టీవీకే పార్టీ విజ్ఞప్తి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని.. కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో మాత్రమే మీడియాను అనుమతిస్తామని స్పష్టం చేశారు. తిరుచ్చి విమానాశ్రయం నుంచి కరూరులోని సమావేశ వేదిక వరకు విజయ్ ప్రయాణించే మార్గంలో జనం గుమికూడకుండా విమానాశ్రయ, ట్రాఫిక్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు పోలీసులు వివరించారు.

అంతే కాకుండా కరూరులోని వేదిక నుంచి ఒక కిలోమీటరు దూరం వరకు ప్రజలెవరూ రాకుండా చర్యలు తీసుకోవాలని పార్టీ వర్గాలు కోరినట్లు సమాచారం. కేవలం బాధితుల కుటుంబ సభ్యులకు మాత్రమే వేదిక వద్దకు ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి టీవీకేకు చెందిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు (SOP) రూపొందించే వరకు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతి ఇవ్వరని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని.. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని విజయ్ మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై మద్రాస్ హైకోర్టు సానుకూలంగా స్పందించకపోవడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిట్ తో దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించారు. సదరు పిటిషన్ ను మొదట వ్యతిరేకించిన న్యాయస్థానం.. ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది.
అలానే తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకుడు, పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు జీఎస్ మణి దాఖలు చేసిన మరో పిటిషన్ను కూడా కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ రెండు పిటీషన్లు కూడా న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్ వీ అంజారియాతో కూడిన ధర్మాసనం ముందుకు రానున్నాయి. తమిళనాడుకే చెందిన బీజేపీ నాయకురాలు ఉమా ఆనందన్ దాఖలు చేసిన పిటిషన్ను కూడా ఇందులోనే క్లబ్ చేయడానికి ఈ ధర్మాసనం అంగీకరించింది.
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
మనసు మార్చుకున్న విజయ్, లేటెస్ట్ సర్వే ఎఫెక్ట్- అనూహ్య నిర్ణయం..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications