వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Twist: ఏక్ నాథ్ షిండే ఏకంగా సీఎం ఎలా అయ్యారంటే ?, మోదీ, అమిత్ షా ప్లాన్, బీహార్ స్కెచ్, శివసేన బ్రాండ్ !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/పాట్నా/న్యూఢిల్లీ: మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యేలతో సహ స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలతో కలిపి 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ బాలాసాహెబ్ ఠాక్రే శివసేనకు చెందిన ఏక్ నాథ్ షిండేని ఎందుకు ముఖ్యమంత్రిని చేశారు ?. ఏక్ నాథ్ షిండేకి 50 మంది ఎమ్మెల్యే మద్దతు మాత్రమే ఉండటంతో ఆయన సీఎం ఎలా అయ్యారు ? తదితర విషయాలపై మహారాష్ట్రలో ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ పెద్దలు అన్నీ ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. బీహార్ ఫార్ములా ప్రయోగించి, 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలను టార్గెట్ చేసుకోవాలని, శివసేన బ్రాండ్ సొంతం చేసుకోవాలని తదితర విషయాలు ఆలోచించి ఏక్ నాథ్ షిండేని ఏకంగా సీఎం చేశారని సమాచారం.

Rebel: ఊపుకుంటూ వెళ్లిపోయిన సంకీర్ణ ప్రభుత్వం, సీఎం, గవర్నర్ భేటీకి ఏక్ నాథ్ షిండే సిద్దం, ఎమ్మెల్యేలు !Rebel: ఊపుకుంటూ వెళ్లిపోయిన సంకీర్ణ ప్రభుత్వం, సీఎం, గవర్నర్ భేటీకి ఏక్ నాథ్ షిండే సిద్దం, ఎమ్మెల్యేలు !

దేవేంద్ర ఫడ్నవిస్ కు అన్నీ అనుకూలంగా ఉన్నా ?

దేవేంద్ర ఫడ్నవిస్ కు అన్నీ అనుకూలంగా ఉన్నా ?

మహారాష్ట్ర సీఎం కావడానికి అన్ని అవకాశాలు ఉన్నా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను కేవలం ఉప ముఖ్యమంత్రిని చెయ్యడం వెనుక పెద్ద కథే ఉందని వెలుగు చూసింది. మహారాష్ట్రలో హిందుత్వ పార్టీ ఏదంటే టక్కున చెప్పేపేరు శివసేన, అలాంటి మహారాష్ట్రలో శివసేను దెబ్బ కొట్టాలని బీజేపీ హైకమాండ్ స్కెచ్ వేసింది తెలిసింది.

బీజేపీకి మోసం చేసి శివసేన

బీజేపీకి మోసం చేసి శివసేన

గత శాసన సభ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చినా మహారాష్ట్రలో అధికారం దక్కించుకోలేకపోయింది. ఉద్దవ్ ఠాక్రేని సీఎం చెయ్యాలనే ఏకైక ఉద్దేశంతో శివసేన నాయకులు కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపి బీజేపీకి ద్రోహం చేసింది. ఈ విషయం మనసులో పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అవకాశం కోసం ఎదురు చూశారు.

శివసేన బ్రాండ్ మీద దెబ్బ కొట్టిన బీజేపీ ?

శివసేన బ్రాండ్ మీద దెబ్బ కొట్టిన బీజేపీ ?


శివసేన మీద ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చెయ్యడంతో ఆయన్నే ముఖ్యమంత్రి చేసిన బీజేపీ పెద్దలు శివసేనకు కోలుకోలేని దెబ్బ కొట్టారు. కు చెందిన ఎమ్మెల్యేని సీఎం చెయ్యాలని, శివసేనకు హిందత్వ బ్రాండ్ లేకుండా చెయ్యాలని, బీజేపీ బలమైన హిందుత్వ పార్టీ అని నిరూపించుకోవాలని బీజేపీ పెద్దలు ఈ స్కెచ్ వేశారని తెలిసింది.

 బీహార్ లో నితీష్ కుమార్ ను ఎలా సీఎం చేశారంటే ?

బీహార్ లో నితీష్ కుమార్ ను ఎలా సీఎం చేశారంటే ?

ప్రధాని మోదీ బీహార్ ఫార్ములాను మహారాష్ట్రలో అమలు చేసి 2024 లోక్ సభ ఎన్నికలు టార్గెట్ చేసుకున్నారని విశ్వసనీయ సమాచారం. బీహార్ లో జేడీయూ కంటే బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. అయితే బీహారి అయిన నితీష్ కుమార్ ను 2020లో ముక్యమంత్రిని చేసిన బీజేపీ అక్కడ మంచి మార్కులు కొట్టేసింది.

Recommended Video

పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia
మరాఠీల ఓట్లు చీలిపోతాయి

మరాఠీల ఓట్లు చీలిపోతాయి


బీహార్ లో చేసిన ప్రయోగమే ఇప్పుడు మహారాష్ట్రలో అమలు చెయ్యాలని ఢిల్లీలోని బీజేపీ నాయకుల లెక్కలు వేశారని వెలుగు చూసింది. ఏక్ నాథ్ షిండే మరాఠీ. మహారాష్ట్రలో మరాఠీల ఓట్లు శివసేన, ఎన్సీపీ చీల్చుకున్నాయి. ఇప్పుడు మరాఠీ ఓట్లు చీల్చాలని అదే వర్గానికి చెందిన ఏక్ నాథ్ షిండేకి చాన్స్ ఇచ్చారని వెలుగు చూసింది. అన్ని లెక్కలు వేసుకున్న తరువాత బీజేపీ నాయులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ఏక్ నాథ్ షిండే ఏకంగా సీఎం అయిపోయారని సమాచారం.

English summary
Twist: A triumphant Eknath Shinde arrived for the swearing-in ceremony with his infant grandson in his arms and took oath after invoking Sena founder Bal Thackeray. By contrast, Devendra Fadnavis looked visibly uncomfortable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X