నేను.. నా రాష్ట్రం.. మారిన అమరీందర్ సింగ్ ట్విట్టర్ బయో..
సోషల్ మీడియా బయో ఇప్పుడు ఏ నేత.. ఏ పార్టీ.. ఏ జెండాతో పనిచేస్తారో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ నేతలు పార్టీ మారే సమయంలో బయో ఛేంజ్ చేస్తుంటారు. దానిని బట్టి ఆ నేత ఎటు వైపు వెళతారో చెప్పవచ్చు. తాజాగా పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కూడా తన ట్విట్టర్ బయో ఛేంజ్ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ లోగో ఉండేది. ఇప్పుడు మార్చేశారు. ఆర్మీ వెటరన్, మాజీ పంజాబ్ సీఎం, కంటిన్యింగ్ టు సర్వ్ ద స్టేట్ అని రాసుకున్నారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని స్పష్టంచేశారు.
అమరీందర్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠ కలిగిస్తోంది. నిన్న అమిత్ షాతో భేటీ అయిన.. బీజేపీలో చేరడం లేదని స్పష్టంచేశారు. ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగబోనని తేల్చిచెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. ఇకపై ఉండబోనని స్పష్టంచేశారు. అమరీందర్ సింగ్.. నిన్న సాయంత్రం హోం మంత్రి అమిత్ షాను ఢిల్లీలో గల అతని కార్యాలయంలో కలిశారు. తన పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం లేదని స్పష్టంచేశారు. కానీ ఆయన అమిత్ షాతో భేటీ కావడం చర్చకు దారితీసింది. అమిత్ షా అధికార నివాసానికి చేరుకున్న.. కెప్టెన్ వివిధ అంశాలపై డిస్కష్ చేశారు.

మరోవైపు ఇంకా దారులు మూసుకుపోలేదని అమరీందర్ సింగ్ సన్నిహితులు అన్నారు. చర్చలకు అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. కానీ ఈ సమయంలో గాంధీ కుటుంబం.. అమరీందర్తో చర్చలు జరుపుతారా అనే అంశంపై స్పష్టత లేదు. సిద్దూ పీసీసీ చీఫ్ పదవీకి రాజీనామా చేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో అమరీందర్/ సిద్దూను చక్కదిద్దేందుకు హై కమాండ్ విశ్వప్రయత్నాలు చేసింది. కానీ మంగళవారం మంత్రివర్గం కొలువుదీరింది. రాణా మంత్రి పదవీ చేపట్టడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. సిద్దుకు స్థిరత్వం లేదని అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. కానీ పీసీసీ చీఫ్గా కొనసాగుతానని సిద్దూ ప్రకటన చేయడం కాస్త ఊరట కలిగించే అంశం. అమరీందర్ మాత్రం సస్పెన్స్ను కంటిన్యూ చేస్తున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications