Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ బంద్ ప్రారంభం-ట్రేడ్ యూనియన్ల పిలుపుతో దేశవ్యాప్తంగా-బ్యాంకుల మద్దతు

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రెండు రోజుల భారత్ బంద్ కు ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. ఈ మేరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో బంద్ మొదలైంది. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం దీనికి మద్దతునిచ్చింది.

ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎమ్ఎస్, సీఐటీయూ సహా పలు సంఘాలు బంద్ నిర్వహిస్తున్నాయి. హర్యానా చండీగఢ్ ట్రేడ్ యూనియన్లలో ఎస్మా విధించే అవకాశం ఉన్నప్పటికీ రోడ్డు మార్గాలు, రవాణా, విద్యుత్ శాఖల కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఏఐయూటీయూసీ, టీయూసీసీ, సెవా, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీతో కూడిన ఉమ్మడి ఫోరం బంద్ చేపడుతోంది.

Two-day Bharat Bandh begins against central government policies, bank associations support

బంద్ కారణంగా పలు రాష్ట్రాల్లో రవాణా, వ్యాపార, వాణిజ్యాలతో పాటు బ్యాంకింగ్ ఇతర కార్యకలాపాలు కూడా నిలిచిపోనున్నాయి. బ్యాంకు శాఖలు, కార్యాలయాలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బెంగళూరుకు చెందిన కెనరా బ్యాంక్ తెలిపింది. అయితే, బ్యాంక్ పనితీరుపై బంద్ ప్రభావం పడబోతంది. ప్రైవేట్ బ్యాంక్ RBL తమ బ్యాంక్ యూనియన్‌లు AIBOA, AIBEAలతో అనుబంధంగా ఉన్నాయని, ఈ యూనియన్‌లతో సంబంధం ఉన్న ఉద్యోగులు సమ్మెలో పాల్గొనవచ్చని పేర్కొంది. మార్చి 31న కూడా బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కానున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగులు సమ్మె చేయనున్నట్లు కార్మిక సంఘం నేతలు ప్రకటించారు. విద్యుత్ (సవరణ) బిల్లు 2021ని ఉపసంహరించుకోవాలని, అన్ని రకాల ప్రైవేటీకరణ ప్రక్రియలను నిలిపివేయాలని, ముఖ్యంగా కేంద్ర పాలిత ప్రాంతాలైన చండీగఢ్, దాద్రా నగర్ హవేలీలలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయంపై విద్యుత్ శాఖ ఉద్యోగులు,ఇంజనీర్లు భగ్గుమంటున్నారు. విద్యుత్ బోర్డులను రద్దు చేసిన తర్వాత నియమితులైన విద్యుత్ ఉద్యోగులందరినీ పాత పెన్షన్ విధానంలో చేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు నిర్వహించే యుటిలిటీలు మరియు ఇతర ఏజెన్సీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, జాతీయ గ్రిడ్ 24 గంటల విద్యుత్ సరఫరా, స్థిరత్వాన్ని కాపాడాలని సూచించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్, రీజనల్ లో డిస్పాచ్ సెంటర్లకు ఈ సూచనలు జారీ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+