రేపటినుంచి రెండురోజులు సమ్మె.. బ్యాంకులు కూడా, కానీ పరిమిత సేవలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలకు వ్యతిరేకంగా రెండురోజులు స్ట్రైక్ చేయనున్నాయి. సోమవారం, మంగళవారం బ్యాంకు సిబ్బంది సమ్మెలో పాల్గొంటారు. సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ సంయుక్తంగా భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. బంద్ కోసం సహకరించాలని సెంట్రల్ ట్రేడింగ్ యూనియన్ ఇటీవల జరిగిన సమావేశంలో వెల్లడించారు.
వర్కర్లకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా, జాతీయ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలకు నిరసన తెలియజేయనున్నారు. ఈపీఎఫ్ జమపై వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించిన విషయాన్ని 22వ తేదీన ఢిల్లీ జరిగిన సమావేశంలో ప్రస్తావించారు. పెట్రోల్, ఎల్పీజీ, కిరోసిన్, సీఎన్జీ మొదలైనవాటిలో ఆకస్మిక పెంపుదల, మానిటైజేషన్ ప్రోగ్రామ్ అమలు చేయడానికి చర్యలు తీసుకుంటోంది.

ద్రవ్యోల్బణం, క్రాష్ అవుతున్న షేర్ మార్కెట్ల కారణంగా మాత్రమే వాటిని నిలిపివేశారు. సమావేశాంలో ఇటువంటి విధానాలన్నింటినీ ఖండించారు. గ్రామీణ బంద్ను పాటిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా చేసిన ప్రకటనకు సమావేశంలో మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొనాలని రాష్ట్ర స్థాయిల్లోని వివిధ సంఘాలకు సమావేశం విజ్ఞప్తి చేసింది. కేంద్ర కార్మిక సంఘాలు INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC ఇందులో ఉన్నాయి.
బ్యాంకింగ్ రంగం సైతం సమ్మెలో పాల్గొంటుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫేస్బుక్లో తెలిపింది. బ్యాంక్ సమ్మె రోజులలో తమ బ్రాంచ్లు, వాటి ఆఫీసులలో సాధారణ పనితీరును నిర్ధారించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినప్పటికీ, సమ్మె కారణంగా బ్యాంకులో పని పరిమిత స్థాయిలో మాత్రమే జరగొచ్చని ఒక ప్రకటనలో ఎస్బీఐ తెలిపింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications