ఆర్మీలో ఉద్యోగాలు అంటూ ఘరానామోసం, కిలాడీ లేడీలు, ఇద్దరు అరెస్టు, జ్యోతిలక్ష్మి !
బెంగళూరు: భారత సైన్యం (మిలటరి)లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతను నమ్మించి మోసం చేస్తున్న ఇద్దరిని బెంగళూరు నగరంలోని హెబ్బాళ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. పరారైన మరో మహిళతో సహ ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హెబ్బాళలో నివాసం ఉంటున్న కృష్ణరాజన్, సుజాత అనే ఇద్దరిని అరెస్టు చేశారు. పరారైన జ్యోతిలక్ష్మి, మెహబూబ్ బాషా కోసం పోలీసులు గాలిస్తున్నారు. కృష్ణరాజన్, సుజాత, జ్యోతిలక్ష్మి, మెహబూబ్ బాషా అనే నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాధించాలని ప్రయత్నిస్తున్న వారిని గుర్తిస్తున్నారు.

తరువాత వారికి మిలటరీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి రూ. 2 లక్షలు ఇవ్వాలని ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నారు. అడ్వాన్స్ గా రూ. 40 వేలు తీసుకుంటున్నారు. ఊటీ తదితర ప్రాంతాలకు నిరుద్యోగులను పిలుచుకుని వెలుతున్నారు.
ఊటీ తదితర ప్రాంతాల్లో వారికి పరిచయం ఉన్న వైద్యుల దగ్గర మెడికల్ టెస్ట్ (వైద్య పరీక్షలు) చేయించినట్లు డ్రామాలు ఆడుతున్నారు. అనంతరం నకిలీ అపాయింట్ మెంట్ లెటర్లు నిరుద్యోగులకు ఇచ్చి వారిని మోసం చేస్తున్నారు.
నిరుద్యోగులకు చిక్కకుండా ఈ నలుగురు తప్పించుకుని తిరుగుతున్నారు. దీపు శంకర్ అనే భాదితుడు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ విధంగా వీరికి నగదు ఇచ్చి ఉద్యోగాలు రాకుండా తిరుగుతున్న వారు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రధించాలని హెబ్బాళ పోలీసులు మనవి చేశారు. గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని సుజాత అనేక మందిని మోసం చేసిందని కేసులు నమోదు అయ్యాయని పోలీసులు అన్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications