మరో దారుణం: బులంద్షహర్లో ఇద్దరు సాధువుల హత్య
లక్నో: మహారాష్ట్రలోని పాల్ఘర్లో జరిగిన ఇద్దరు సాధువులతోపాటు ఓ డ్రైవర్ను దారుణంగా హత్య చేసిన ఘటన మరువక ముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్షహర్లో మరో దారుణం జరిగింది. మంగళవారం దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి ఇద్దరు సాధువులను దారుణంగా హత్య చేశాడు.
టంగ్స్(పటకారు) దొంగతనం చేశావంటూ దూషించడంతో మురళి అనే నిందితుడు ఇద్దరు సాధువులు జగదీష్ దాస్(55), షేర్ సింగ్(45)లను దేవాలయంలోనే హత్య చేశాడు. పగౌనా గ్రామంలోని ఓ ఆలయంలో ఆ ఇద్దరు సాధువులు నివాసం ఉంటుండగా ఈ దారుణం జరిగింది.
మద్యంమత్తులో ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు మురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, దేవుడి కోరిక ప్రకారమే తాను ఆ ఇద్దరు సాధువులను చంపేశానని నిందితుడు పోలీసులకు చెప్పడం గమనార్హం.

మంగళవారం ఉదయం హత్యకు గురైన ఇద్దరు సాధువుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో చేతిలో కత్తితో తిరుగుతున్న నిందితుడు మురళీని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
Bodies of two priests found at a temple in Bulandshahr. Police investigation underway. Post-mortem reports awaited. pic.twitter.com/SsH7hMrrSv
— ANI UP (@ANINewsUP) April 28, 2020
నిందితుడు గంజాయి కూడా తీసుకున్నట్లు గుర్తించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని చెప్పిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు సాధువులను కత్తితో పొడిచిన నిందితుడు, ఆ తర్వాత కర్రలతో కొట్టి చంపాడని బులంద్షహర్ ఎస్పీ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. సాధువులను హత్య చేసిన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళన నిర్వహించారు గ్రామస్తులు.
గత 15ఏళ్లుగా జగదీష్, ఐదేళ్లుగా షేర్ సింగ్ దాస్లు ఈ ఆలయంలోనే ఉంటున్నారు. కాగా, సాధువుల ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనపై దర్యాప్తు చేసి సమగ్ర నివేదికను అందించాలని జిల్లా కలెక్టర్, ఎస్ఎస్పీలను ఆదేశించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications