'పన్నీర్ వెనుక ఇద్దరు కేంద్రమంత్రులు.. సంక్షోభానికి అసలు కారణం వారే'
తమిళనాడు రాజకీయ సంక్షోభం వెనుక ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు.
చెన్నై: బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి నోటి వెంట సంచలన వ్యాఖ్యలు వెలువడుతూనే ఉన్నాయి. తమిళనాడు ఆపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు వెనుక కేంద్రం ఉందన్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు రాజకీయ సంక్షోభం వెనుక ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. అయితే వారి పేర్లు మాత్రం ఆయన బయటపెట్టకపోవడం గమనార్హం. సందర్బం వచ్చినప్పుడు వారి పేర్లు బయటపెడుతానని ఆయన తెలిపారు.

గవర్నర్ విద్యాసాగర్ రావు చేసిన జాప్యాన్ని నిరసిస్తూ మొత్తం వ్యవహారంలో విద్యాసాగర్ రావు కూడా న్యాయబద్దంగా వ్యవహరించలేదని అన్నారు. ఇప్పటికైనా గవర్నర్ సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
సాయంత్రం 6గం.ల లోగా పన్నీరు సెల్వం తన మద్దతుదారులైన ఎమ్మెల్యేల జాబితా అందించని పక్షంలో అన్నాడీఎంకె శాసనసభాపక్ష నేత పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.పళనిసామి తనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల జాబితాను రాజ్ భవన్ కు అందజేశారని ఆయన తెలిపారు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications