శబరిమలలోకి వెళ్లనిస్తారు కానీ: వావర్ మసీదులోకి వెళ్లేందుకు మహిళల ప్రయత్నం
పలక్కాడ్: మసీదులోకి ఇద్దరు మహిళలు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కేరళలో జరిగింది. ఈ మహిళలు కేరళలోని మసీదులోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ, వారు తమిళనాడుకు చెందినవారిగా భావిస్తున్నారు.

వావర్ మసీదులోకి వెళ్లే ప్రయత్నం
ఆ మహిళలు మెయిన్ వాలాయర్ చెక్పోస్టులో కళ్లుగప్పి, ఆ తర్వాత నాడుపుని చెక్ పోస్టు నుంచి కేరళలోకి వచ్చారు. వీరు సోమవారం శబరిమల సమీపంలోని వావర్ మసీదులోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిన అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ మహిళలు మాట్లాడుతూ.. శబరిమల ఆలయంలోకి మహిళలను వెళ్లేందుకు అనుమతించినప్పుడు మసీదులోకి వెళ్లేందుకు ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు.

పలు సెక్షన్లపై కేసు
వీరు గత వారం మీడియాతో మాట్లాడుతూ.. తాము మసీదులోకి వెళ్తామని చెప్పారు. అన్నట్లుగానే సోమవారం సాయంత్రం మసీదులోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిపై ఐపీసీ సెక్షన్ 153 కింద కేసు నమోదు చేశారు. వీరు హిందూ మక్కల్ కట్చి అనే సంస్థకు చెందినవారుగా తెలుస్తోంది. పోలీసులు వీళ్లను కోర్టులో హాజరు పరచనున్నారు.

శబరిమలలోకి అనుమతిస్తూ, మసీదులోకి అనుమతించరా?
కాగా, శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు గత ఏడాది తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేరళలోని పినరాయి విజయన్ ప్రభుత్వం ఆ తీర్పును అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇద్దరు మహిళలు ఇటీవల శబరిమల ఆలయంలోకి ప్రవేశించారు. ఇప్పుడు వావర్ మసీదులోకి మహిళల ప్రయత్నం గమనార్హం. అయితే హిందూ ఆచారాలను పక్కన పెట్టి మహిళలను శబరిమలలోకి తీసుకు వెళ్తున్న ప్రభుత్వం, మసీదులోకి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications