activist: భజరంగ్ దళ్ కార్యకర్త హత్య, మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, రూ 10 లక్షలకు డీల్ !
బెంగళూరు: శివమొగ్గలో జరిగిన భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసు రాజకీయ రంగు పులుముకుంది. అమాయకుడైన హర్షాను దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రాజకీయాలకు అతీతంగా పలవురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర సొంత జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు గురికావడం కలకలం రేపింది. భజరంగ్ దళ్ కార్యకర్త హత్యపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. భజరంగ్ దళ్ కార్యకర్త హత్య విషయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ, కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. భజరంగ్ దళ్ కార్యకర్త హత్య జరగకుండా అడ్డుకోవడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, ఇక సామాన్య ప్రజలకు ఈ ప్రభుత్వం భద్రత ఏమి కల్పిస్తుందని ఆరోపించారు. 2023లో జరగబోయే శాసనసభ ఎన్నికలకు ఈ హత్య ట్రైలర్ మాత్రమే అని, ఇక సినిమా మిగిలే ఉందని ఆరోపించారు. ఆదివారం రాత్రి హత్యకు గురైన హర్షాను చంపాలని ఇప్పుడు స్కెచ్ వెయ్యలేదని, రెండు సంవత్సరాల క్రితమే రూ. 10 లక్షలకు హర్షా హత్యకు వెల కట్టారని హత్యకు గురైన యువకుడి బంధువులు ఆరోపిస్తున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చెయ్యడం కలకలం రేపింది. బీజేపీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలపై మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి తనదైన శైలిలో బదులిచ్చారు.

ఉలిక్కిపడిన శివమొగ్గ
భజరంగ్ దళ్ కార్యకర్త, యువకుడు హర్షాను ఇంటి నుంచి పిలిపించి హత్య చెయ్యడంతో శివమొగ్గ పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. హర్షా హత్యతో శివమొగ్గ పట్టణం రణరంగంగా మారిపోయింది. హర్షా అంతిమయాత్ర సందర్బంగా హిందూ సంఘ, సంస్థల మద్దతుదారులు ఆందోళనకు దిగడంతో పలు వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ దెబ్బతో శివమొగ్గ పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు.

హోమ్ మంత్రి సొంత జిల్లాలో కలకలం
వమొగ్గలో జరిగిన భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసు రాజకీయ రంగు పులుముకుంది. అమాయకుడైన హర్షాను దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రాజకీయాలకు అతీతంగా పలవురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర సొంత జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు గురికావడం కలకలం రేపింది.

మాజీ సీఎం హాట్ కామెంట్స్
భజరంగ్ దళ్ కార్యకర్త హత్యపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. భజరంగ్ దళ్ కార్యకర్త హత్య విషయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ, కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. భజరంగ్ దళ్ కార్యకర్త హత్య జరగకుండా అడ్డుకోవడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, ఇక సామాన్య ప్రజలకు ఈ ప్రభుత్వం భద్రత ఏమి కల్పిస్తుందని ఆరోపించారు.

ఇది ట్రైలర్ మాత్రమే..... సినిమా మిగిలే ఉంది
2023లో జరగబోయే శాసనసభ ఎన్నికలకు ఈ హత్య ట్రైలర్ మాత్రమే అని, ఇక సినిమా మిగిలే ఉందని ఆరోపించారు. ఆదివారం రాత్రి హత్యకు గురైన హర్షాను చంపాలని ఇప్పుడు స్కెచ్ వెయ్యలేదని, రెండు సంవత్సరాల క్రితమే రూ. 10 లక్షలకు హర్షా హత్యకు వెల కట్టారని హత్యకు గురైన యువకుడి బంధువులు ఆరోపిస్తున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చెయ్యడం కలకలం రేపింది.

పోలీసుల వేట
బీజేపీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలపై మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి తనదైన శైలిలో బదులిచ్చారు. మొత్తం హిజాబ్ వివాదంతో రగిలిపోతున్న శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్యకు గురి కావడం కర్ణాటకలో కలకలం రేపింది. హర్షా హత్య కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications