Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాసరగూడులో యూత్ కాంగ్రెస్ నాయకుల దారుణ హత్య, సీఎం విఫలం యూడీఎఫ్!

కాసరగూడు (కేరళ): కేరళలోని కాసరగూడులో ఇద్దరు యూత్ కాంగ్రెస్ నాయకులు దారుణ హత్యకు గురైనారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చెయ్యడంతో కర్ణాటక- కేరళ రాష్ట్రాల సరిహద్దులోని కాసరగూడు రగిలిపోతుంది.

కాంగ్రెస్ పార్టీ యుత్ విభాగానికి చెందిన కృపేష్, శరథ్ లాల్ అనే ఇద్దరు హత్యకు గురైనారని పోలీసులు తెలిపారు. కృపేష్, శరథ్ లాల్ అనే ఇద్దరి హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల హత్యలను పలు పార్టీలు ఖండిస్తున్నాయి.

Two Youth Congress workers hacked to death in Kasaragod by unidentified assailants.

కాంగ్రెస్ పార్టీ నాయకుల హత్యకు ఖండిస్తూ యునైటెడ్ డెమాక్రటిక్ ఫ్రెంట్ (యూడీఎఫ్) సోమవారం కేరళలో ధర్నాలకు పిలుపునిచ్చింది. కాసరగూడులో ప్రసిద్ది చెందిన బేకల్ కోటేలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు కృపేష్, శరథ్ లాల్ ను అతి దారుణంగా హత్య చేయ్యడంతో పోలీసులు హడలిపోయారు.

కేరళలో ముఖ్యమంత్రి పిణరయి విజయన్ ప్రభుత్వం హత్యలను ప్రోత్సహిస్తుందని కాంగ్రెస్ పార్టీ, యూడీఎఫ్ ఆరోపించింది. కేరళలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. సీపీఐ (ఎం) నాయకులు పక్కా ప్లాన్ తో ఇద్దరిని ఇంత దారుణంగా హత్య చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+