Haryana: ఆవులు అక్రమంగా తరలిస్తున్నారని యువకులపై దాడి.. తీవ్ర గాయాలతో ఇద్దరు మృతి..
ఆవులు అక్రమంగా తరలిస్తున్నారని ఇద్దరు యువకులపై దాడి చేయగా వారు మృతి చెందారు.
రాజస్థాన్కు చెందిన ఇద్దరు ముస్లిం యువకులు ఆవు వధ కోసం తరలిస్తున్నారని వారి దాడి చేసిన ఘటన హర్యానాలో జరిగింది.హర్యానాలోని నుహ్లో బుధవారం రాత్రి వధ కోసం ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో 25 ఏళ్ల నాసిర్, 35 ఏళ్ల జునైద్ అలియాస్ జునాపై నలుగురు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో నిందితులు రింకు సైనీ, టాక్సీ డ్రైవర్ ఇప్పటికే అరెస్టయ్యారు. కౌ విజిలెంట్ గ్రూప్ సభ్యుడు ఇద్దరు బాధితులను హర్యానాలోని ఫిరోజ్పూర్ జిర్కాలోని సమీప పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు.
కొద్దిసేపటికే జునైద్, నసీర్ గాయాలతో మరణించారు. భయభ్రాంతులకు గురైన ఆవు సంరక్షకుల బృందం మృతదేహాలను పారవేసే మార్గాలను ఆలోచించేందుకు వారి సహచరులను సంప్రదించినట్లు తెలిసింది. వారు చివరకు తమ బొలెరో SUVలో రెండు మృతదేహాలను 200 కి.మీ దూరంలోని భివానీకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. గురువారం తెల్లవారుజామున రెండు మృతదేహాలను వాహనంతో పాటు పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసు వర్గాలు తెలిపాయి.

నేరం జరిగిన ప్రదేశానికి దూరంగా అక్కడ కాల్చినట్లయితే, మృతదేహాలను, కాలిపోయిన వాహనాన్ని ఎవరూ తిరిగి కనుగొనలేరని నిందితుల భావించారు. అయితే బొలెరో ఛాసిస్ నంబర్ ఆధారంగా జునైద్, నసీర్లను గుర్తించారు. నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. పరారీలో ఉన్న మోను మనేసర్ ఆయుధాల లైసెన్స్ను రద్దు చేసేందుకు హర్యానా అధికారులు కదులుతుండగా, రాష్ట్ర అధికార బీజేపీ అగ్రనేతలతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో అతని రాజకీయ సంబంధాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications