బీజేపీ చర్యలకు ఉద్దవ్ మద్దతు ? కర్ణాటక పరిణామాలను అభినందించిన శివసేన చీఫ్
ముంబై : ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన బీజేపీ చేసిన చర్యలకు మద్దతిచ్చింది. అయితే మరో రెండునెలల్లో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శివసేన వైఖరి ప్రాధాన్యం సంతరించుకుంది. గత 3 వారాలుగా కొనసాగిన సస్పెన్స్ను ఇటీవల తెరపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే స్పందించారు.
Recommended Video

గత కొంతకాలంగా బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న శివసేన .. తాజాగా స్వరం మార్చడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు బీజేపీకి విషేష్ తెలుపడం విస్మయానికి గురిచేసింది. అంతేకాదు జేడీఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ప్రజాస్వామ్యానికి చేటు కలిగినట్టేనని వ్యాఖ్యానించడం ఆసక్తి కలిగించింది. ఎట్టకేలకు కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొనడం విశేషం.

మెజార్టీ లేని రాష్ట్రాలలో అధికారంలోకి రావడం అంటే ప్రజాస్వామ్యానికి చేటు చేయడమని శివసేన పేర్కొనడం గమనార్హం. అయితే కర్ణాటకలో బీజేపీకి 105 సభ్యుల మద్దతు ఉంది. అయితే బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇంకా ఆహ్వానం రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో శివసేన కామెంట్స్ సంచలనం కలిగించాయి. మరోవైపు మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కూడా జెండా పాతాలని బీజేపీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఉద్దవ్ హాట్ కామెంట్స్ చేశారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications