సంపాదకుడి నుంచి సీఎం వరకు, థాకరే కుటుంబం నుంచి తొలిసారిగా, ఉద్దవ్ నేపథ్యం..
ఉద్దవ్ థాకరే.. శివసేన చీఫ్గానే తెలుసు. ఆ పార్టీ మౌత్పీస్గా పిలువబడే 'సామ్నా' పత్రిక ఎడిటర్గా వ్యవహరించారు. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్న తనదైనశైలిలో సంపాదకీయం రాస్తూ ముద్ర వేశారు. ప్రాంతీయ పార్టీ అయిన శివసేన సీఎం పదవీ చేపట్టే సీట్లు సాధించలేదు. కానీ ఎన్నికల తర్వాత బీజేపీ-శివసేన మధ్య సీఎం పోస్టు కోసం యుద్ధమే జరిగింది. చివరికి కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి జైకొట్టి.. ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రి పదవీ చేపట్టారు.

పోటీకి దూరం..
వాస్తవానికి శివసేన పార్టీ నుంచి ఇదివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా ఎవరూ పోటీ చేయలేదు. బాల్ థాకరే.. ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కానీ మహారాష్ట్రీయుల సమస్యలపై మాత్రం ఆలుపెరుగని పోరాటం చేశారు. ఆయన కుమారుడు ఉద్దవ్ కూడా ప్రత్యక్ష రాజకీయాలు అంటే ఆసక్తి చూపించలేదు. 2014లో సీఎం పదవీ ఆశించారు.. కానీ బీజేపీ ఇవ్వకపోవడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. కానీ 2019లో మాత్రం సీన్ మారింది. సీఎం పోస్టు కోసం పట్టుబట్టీ మరీ బీజేపీకి హ్యాండిచ్చారు.

పోటీకి నో.. కానీ
ఉద్దవ్ థాకరే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. సీఎం పదవీ చేపట్టాక.. ఆరునెలల్లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా గెలుపొందాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు సామ్నా పత్రిక ఎడిటర్గా ఉన్న ఉద్దవ్.. గురువారం రాజీనామా చేశారు. సీఎం పదవీ చేపట్టే కొన్ని గంటల ముందు రిజైన్ చేశారు. దీంతో సామ్నా మొదటి పేజీలో ఎడిటర్-ఇన్-చీఫ్ అనే పేరు ఉద్దవ్ థాకరే కనిపించదు. శివసేన పార్టీకి చెందిన సంజయ్ రౌత్ సామ్నా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు.

20 ఏళ్ల తర్వాత
20 ఏళ్ల తర్వాత శివసేన పార్టీకి చెందిన నేత సీఎం పదవీ చేపట్టారు. ఉద్దవ్ థాకరేకు ముందు నారాయణ్ రాణే సీఎం పదవీ చేపట్టారు. 1999లో ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. తొలుత 1995లో మనోహర్ జోషి శివసేన నుంచి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. జోషి, రాణే తర్వాత మూడో శివసేన సీఎంగా ఉద్దవ్ ప్రమాణం చేశారు.

2014లో ఇంట్రెస్ట్
బాల్థాకరే తనయుడిగా ఉద్దవ్. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. 2014లో సీఎం పోస్టపై ఇంట్రెస్ట్ చూపించారు. కానీ కుదరకపోవడంతో మిన్నకుండిపోయారు. ఈసారి కలిసి రావడంతో ముఖ్యమంత్రి పీఠం చేపట్టారు. సీఎం పదవీ చేపట్టేందుకు తనకు అవకాశం కల్పించిన కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలకు ఉద్దవ్ థాకరే ధన్యవాదాలు తెలిపారు.

తెరపైకి ఆదిత్య.. కానీ
ఈ సారి థాకరే కుటుంబం సీఎం పదవీ చేపట్టబోతుందనే ప్రచారం జరిగింది. ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే వర్లి నుంచి పోటీచేయడంతో ఆయన పదవీ చేపడుతారా అనే చర్చ జరిగింది. 29 ఏళ్లకే సీఎం పదవీ అని డిస్కషన్ జోరుగా సాగింది. అయితే బీజేపీతో పొత్తు పొడవకపోవడం.. కాంగ్రెస్-ఎన్సీపీతో దోస్తి కుదరడంతో.. ఆదిత్య థాకరేకు సీఎం పదవీ అనే అంశం మసకబారిపోయింది.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications