UGC NET 2021 వాయిదా -కొవిడ్ విలయం కారణంగా కేంద్ర విద్యా శాఖ నిర్ణయం -మళ్లీ ఎప్పుడంటే..
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరి, దాదాపు అన్ని రాష్ట్రాలూ కఠిన ఆంక్షలు, కర్ఫ్యూ నిర్ణయాలు తీసుకుంటుడగా, విద్యా వ్యవస్థపైనా ఆ ప్రభావం తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో జూనియర్ ప్రొఫెసర్ ఫెలోషిప్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ (యుజిసి) నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నెట్) సైతం వాయిదా పడింది.
కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో యూజీసీ నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్(నెట్) పరీక్ష షెడ్యూల్ వాయిదా పడింది. మే 2 నుండి 17వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ మంగళవారం తెలిపారు. వాస్తవానికి ఈ ఎగ్జామ్ గతేడాది డిసెంబర్లోనే జరగాలి. కానీ గత ఏడాదిగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కొనసాగుతుండటంతో నోటిఫికేషన్ ఆలస్యంగా రిలీజ్ అయింది. షెడ్యూల్ ప్రకారం యూజీసీ నెట్ డిసెంబర్ 2020 సెషన్ ఎగ్జామ్ మే 2 నుంచి మే 17 మధ్య జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా మరోసారి వాయిదాపడింది.

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ఇప్పటికే సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్ రద్దయ్యాయి. 12వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. మరోవైపు ఐసీఎస్ఈ టెన్త్ పరీక్షలు కూడా రద్దయ్యాయి. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు రద్దయి, ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్షల్ని వాయిదా వేసింది. జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా వాయిదా పడ్డాయి.
యూజీసీ నెట్ ను వాయిదా వేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టీఏ) సైతం అధికారికంగా ప్రకటించింది. అయితే మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామన్న సంగతి ఎన్టీఏ వెల్లడించలేదు. పరీక్షలకు 15 రోజుల ముందే కొత్త తేదీలపై సమాచారం ఇస్తామని ప్రకటించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉత్తర్వుల ప్రకారం పరీక్షకు కనీసం 15 రోజుల ముందు ఎగ్జామ్ షెడ్యూల్ను ప్రకటించనున్నారు. ప్రస్తుత కొవిడ్ ఉధృతి కారణంగా విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని యూజీసీ నెట్ డిసెంబర్ 2020 షెడ్యూల్ను (మే 2021)ను వాయిదా వేసినట్లు పోక్రియాల్ పేర్కొన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications