అదేం లేదు, రైతులతో సంప్రదింపులు జరిపాం, వ్యవసాయ చట్టాలపై నిర్మల
వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ స్పష్టంచేయగా.. విత్తమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. రైతు నేతలు చెబుతోన్న కనీస మద్దతు ధర అంశం ఆ వ్యవసాయ చట్టాల్లో లేదు అని పేర్కొన్నారు. ఓ మీడియాతో ఇంటర్వ్యూ సందర్భంగా కామెంట్ చేశారు. కనీస మద్దతు ధర అందులో లేదని.. గత ఆరేళ్లలో పంటలు, ధర ప్రకటించలేదు అని తెలిపారు.
అయితే చట్టం తీసుకొచ్చే ముందు రైతులతో సంప్రదింపులు జరపలేదనడం మాత్రం అన్యాయం అన్నారు. వారితో ఇప్పుడు కాదు 2000 ఏడాది నుంచి సంప్రదింపులు జరిపారని గుర్తుచేశారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయం నుంచి ఈ అంశంపై డిస్కస్ చేశామని తెలిపారు.

ప్రభుత్వం-రైతుల మధ్య ఆరు రౌండ్ల చర్చలు జరిగాయి. కానీ ఏకాభిప్రాయం మాత్రం రాలేదు. రైతుల తమ ఉద్యమాని మరింత తీవ్రతరం చేస్తున్నారు. ప్రధాన రహదారుల దిగ్బందనం, రైల్వై ట్రాక్ కలిపే రహదారుల వద్ద అడ్డుకోవడం చేస్తున్నారు.
Recommended Video
మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒంటికాలిపై లేస్తున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నామనే కేంద్ర ప్రభుత్వ ప్రకటనను.. ఖండించారు. ప్రభుత్వ తీరు డబుల్ చేయడం కాదు.. బీహర్ రైతుల స్థాయికి తీసుకెళ్లడం అంటూ ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications