దావూద్కి సురక్షిత స్థావరం: ఏర్పాట్లు చేస్తున్న ఐఎస్ఐ?
దావూద్ను ఇంతకు ముందు థాయలాండ్, నైరోబి, యుఏఈ, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు తరలించాలని అనుకున్న ఐఎస్ఐ ఆ ప్రయత్నాలను విరమించుకుందని, ఇప్పుడు దేశంలోనే సురక్షితమైన ప్రాంతానికి ఆయనను మార్చడానికి ఐఎస్ఐ ప్రయత్నాలు చేస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
దావూద్ను యుఏఈకి మార్చాలనుకున్న ఐఎస్ఐ.. చివరి క్షణంలో ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు తెలిసింది. అలాగే బంగ్లాదేశ్కు భారత్తో మంచి సంబంధాలుండడంతో బంగ్లాదేశ్కు తరలించాలన్న యోచనను కూడా అది విరమించుకుంది.
దావూద్ ఇబ్రహీంకు రక్షణ కల్పించే బాధ్యతను పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐకి చెందిన సీనియర్ అధికారులకు అప్పగించినట్లు తెలుస్తోంది. శనివారం ఓ కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ దావూద్ ఇబ్రహీం పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో ఉన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.
దావూద్ ఇబ్రహీంను భారత్కు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, పాకిస్థాన్పై దౌత్యపరంగా ఒత్తిడి తెస్తోందని కూడా కేంద్రమంత్రి చెప్పారు.