3 లక్షల వరకు మినహాయింపు: ఇదీ జైట్లీ ఆదాయ పన్ను..., ఎవరు ఎంత కట్టాలి?
ఆదాయపన్ను విధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. మూడు లక్షల రూపాయల ఆదాయం వరకు ఎలాంటి పన్ను మినహాయింపు ఇచ్చారు.
న్యూఢిల్లీ: ఆదాయపన్ను విధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. మూడు లక్షల రూపాయల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేకుండా మినహాయింపు ఇచ్చారు. రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుందని అందరూ భావించారు. కానీ జైట్లీ షాకిచ్చారు.
అయితే, ఆదాయ పన్నును మాత్రం పది శాతం నుంచి ఐదు శాతం తగ్గించారు. రూ. మూడు లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను పైన ఐదు శాతం ట్యాక్స్ ఉంటుంది.

- రూ.3లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు.
- ఆదాయ పన్ను పది శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
వ్యక్తిగత ఆదాయ పన్ను: 5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు.
- వార్షికాదాయం రూ.50లక్షలు అంతకన్నా ఎక్కువ వస్తే 10శాతం సర్ఛార్జి.
- రూ.5 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారికి 50 శాతం దాకా సేవింగ్స్ సదుపాయం
- ఆదాయం రూ.కోటి దాటితే 15 శాతం సర్ ఛార్జ్.
- ఆదాయపన్ను శ్లాబులు యథాతథం
- రాజకీయ పార్టీల విరాళాలు రూ.20వేలకు మించితే తప్పనిసరిగా లెక్క.
ఎవరు ఎంత కట్టాలి?
రూ.4 లక్షల ఆదాయం ఉన్న వాళ్లు కట్టాల్సిన పన్ను రూ.7,950.
రూ.5 లక్షల ఆదాయం ఉన్న వాళ్లు కట్టాల్సిన పన్ను రూ.13250
రూ. పది లక్షల ఆదాయం ఉన్నవాళ్లు కట్టాల్సిన పన్ను రూ.1 లక్షా 16వేలు.












Click it and Unblock the Notifications